NTV Telugu Site icon

IND vs WI: మూడో టీ20 కోసం నాలుగు మార్పులు చేసిన టీమిండియా

కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఇరు జట్లు తుది జట్టులో నాలుగు మార్పులు చేశాయి. విరాట్ కోహ్లీ, పంత్, భువనేశ్వర్, చాహల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. రుతురాజ్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, బిష్ణోయ్, చాహల్
వెస్టిండీస్ జట్టు: హోప్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), పావెల్, ఛేజ్, పొలార్డ్, హోల్డర్, అలెన్, షెపర్డ్, వాల్ష్, డ్రేక్స్