Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

  • వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ
  • 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 పరుగులు
  • ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi History

Vaibhav Sooryavanshi History

Naseer Hussain’s Shocking Comments on Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన 2026 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 55 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 పరుగులు చేశాడు. వైభవ్ అద్భుత ప్రదర్శనను జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ప్రభావాన్ని అరికట్టేందుకు సూర్యవంశీని క్రికెట్ నుంచే నిషేధించాలని డిమాండ్ చేశాడు. హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ… ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోంది. భవిష్యత్తులో క్రికెట్‌లో నిజమైన స్పిరిట్ ఉండకపోవచ్చు. క్రికెట్‌కు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు’ అని వ్యాఖ్యానించాడు. గతంలో ఐసీసీపై బ్రిటన్ ప్రభావం ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాను సుమారు 20 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం పెట్టారని, జింబాబ్వేకు ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కు వీసాలు నిరాకరించారని గుర్తు చేశాడు. అవన్నీ మానవత్వం, ప్రపంచ సూత్రాల పేరుతో తీసుకున్న నిర్ణయాలేనని సమర్థించుకున్నాడు.

Also Read: IND Playing XI vs USA: అమెరికాతో మ్యాచ్‌.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై కూడా నాసిర్ హుస్సేన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఉగ్రవాదం పేరుతో పాకిస్తాన్‌పై భారత్ రాజకీయాన్ని క్రికెట్‌లోకి తెస్తోంది. ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఆటకు ఇది పూర్తి విరుద్ధం’ అంటూ బీసీసీఐని విమర్శించాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేస్తూ… ‘ఇప్పుడు మా (ఇంగ్లాండ్‌) జట్టుపై 14 ఏళ్ల పిల్లాడు ఫైనల్‌లో వేగవంతమైన సెంచరీ చేశాడు. ఇది బీసీసీఐ ప్రభావాన్ని మరింత పెంచుతుంది. దీని వల్ల క్రికెట్ తప్పుదారి పడే ప్రమాదం ఉంది. బీసీసీఐ ప్రభావాన్ని అరికట్టేందుకు ఇతర దేశాలు ఈసీబీతో కలిసి రావాలి’ అంటూ నాసిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హుస్సేన్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాపై హుస్సేన్ అక్కలు వెళ్లగక్కడం ఇదేం కొత్త కాదు కానీ.. బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.