IND vs PAK Warm-up Matches: T20 ప్రపంచ కప్ వివాదం.. నేడు భారత్- పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్లు
- మరో మూడు రోజుల్లో పారంభం కానున్న టీ20 ప్రపంచకప్..
- నేడు టోర్నమెంట్ లో భారత్- పాకిస్థాన్ వార్మప్ మ్యాచులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Warm-up Matches: టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్మ్-అప్ మ్యాచ్లు అభిమానులకు అదనపు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్లు జరగనుండగా, భారత్- పాకిస్థాన్ రెండు వేర్వేరు మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాయి. భారత జట్టు ఈరోజు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సాయంత్రం 5 గంటలకు పాక్ జట్టు ఐర్లాండ్తో పోటీ పడుతుంది.
Read Also: Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
భారత్–పాక్ వివాదం కొనసాగుతూనే…
అయితే, మైదానం బయట పరిస్థితులు మాత్రం రెండు జట్లకూ అనుకూలంగా లేవు.. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. మెగా టోర్నమెంట్లో టీమిండియాతో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే అనుమతి నిరాకరించిందని తెలుస్తుంది. ఈ అంశంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా సరే, ఇరు జట్లు మైదానంపై దృష్టి సారించి తమ తొలి మ్యాచ్లకు సిద్ధమవడం కీలకంగా మారింది. వార్మ్-అప్ మ్యాచ్లు జట్లకు సరైన సమన్వయం సాధించేందుకు ఉపయోగపడనున్నాయి.
Read Also: Jaishankar: అమెరికాలో జైశంకర్ పర్యటన.. ఆర్థిక సంబంధాలపై చర్చ
ఎక్కడ జరుగుతున్నాయి మ్యాచ్లు?
* భారత్- దక్షిణాఫ్రికా వార్మ్-అప్ మ్యాచ్ నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది.
* పాకిస్థాన్- ఐర్లాండ్ మ్యాచ్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతుంది.
* నమీబియా vs స్కాట్లాండ్ – మధ్యాహ్నం 1 గంటలకు, ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్ – మధ్యాహ్నం 3 గంటలకు ఈ రెండు మ్యాచ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని వేర్వేరు మైదానాల్లో జరుగుతాయి. అయితే, భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లకు ఇవే చివరి వార్మ్-అప్ మ్యాచ్లు. తదుపరి వీరు నేరుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ జోరు
ఇక, ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి వార్మ్-అప్ మ్యాచ్లో స్కాట్లాండ్పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆఫ్ఘన్ బౌలర్లు, చివరి నిమిషంలో బంగ్లాదేశ్ స్థానంలో టోర్నమెంట్లోకి వచ్చిన స్కాట్లాండ్ను కేవలం 123 పరుగులకే కట్టడి చేశారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..