స్టాండ్బై ప్లేయర్స్ లేకుండానే T20 World Cupకు టీమిండియా.. ఎందుకంటే..?
- 2026 టీ20 వరల్డ్ కప్కు భారత జట్టు ప్రకటన..
- టీ20 వరల్డ్ కప్కు స్టాండ్బై ప్లేయర్లను ఎంపిక చేయని బీసీసీఐ..
- వరల్డ్ కప్కు స్టాండ్బై ప్లేయర్స్ అవసరం లేదన్న బీసీసీఐ కార్యదర్శి సైకియా..
No Standby Players: టీ20 వరల్డ్ కప్ 2026కకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఈరోజు బీసీసీఐ (డిసెంబర్ 20) ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో పలు కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్తో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మను జట్టు నుంచి తప్పించింది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన రింకూ సింగ్ ను మళ్లీ టీంలోకి రాగా, గాయంతో గత రెండు టీ20 మ్యాచ్లకు దూరమైన అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చి సూర్యకుమార్ కు డిప్యూటీగా బాధ్యతలు అందుకున్నాడు.
Read Also: China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్లో ఇండియా!
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
అయితే, ఈసారి టీమిండియా సెలెక్టర్లు ఎవరినీ స్టాండ్బై ఆటగాళ్లను ప్రకటించకపోవడం విశేషం. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్లకు స్టాండ్బై ప్లేయర్లను ప్రకటించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈసారి అలాంటి జాబితా మాత్రం భారత జట్టులో కనిపించలేదు.. దీనిపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్ మొత్తం మన దేశంలోనే జరుగుతోంది.. అవసరమైతే ఎప్పుడైనా ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.. అందుకే స్టాండ్బై ప్లేయర్స్ అవసరం లేదని నిర్ణయించామని పేర్కొన్నారు.
Read Also: Hydra: నిజాం కాలం నాటి ‘బమ్రుక్నా ఉద్దౌలా’ చెరువుకు అభివృద్ధి పనులు వేగవంతం!
ఇక, ఈ వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లీగ్ దశలో పాకిస్థాన్తో మ్యాచ్ కోసం మాత్రమే భారత్ శ్రీలంకకు ప్రయాణించనుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న టీమిండియా ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో రెండో మ్యాచ్, ఫిబ్రవరి 15న కొలంబో ఆర్.ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 18వ తేదీన నెదర్లాండ్స్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగగా, మార్చి 8న ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీ ముగియనుంది.
🚨 SQUAD ALERT 🚨
Team India has announced a 15-member squad for the ICC #T20WorldCup 2026! 😮
Double tap ❤️ to wish India best of luck! 🇮🇳👏🏻
Watch Follow The Blues LIVE 👉 https://t.co/HCxHPl6kFs pic.twitter.com/yFHLmJZLCL
— Star Sports (@StarSportsIndia) December 20, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
-
Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
-
West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?