T20 WC 2024 Super 8: సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా
- జూన్ 20న అఫ్గాన్తో భారత్
- స్పిన్ను ఎదుర్కోవడం కష్టం
- తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja About India Plans for Super Eight: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్ఏలోని డ్రాప్-ఇన్ పిచ్లపై మ్యాచ్లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే విండీస్లో ఆడనుంది. విండీస్ పిచ్లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తాం అని వారు వెల్లడించారు.
సూపర్-8కు ముందు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో రవీంద్ర జడేజా మాట్లాడుతూ… ‘విండీస్లో పిచ్లు చాలా నెమ్మదిగా, మందకొడిగా ఉంటాయి. మ్యాచ్లు అన్ని ఉదయం కావడంతో స్పిన్నర్లకు అక్కడ మంచి సహకారం లభిస్తుంది. భారత్లో మాదిరిగానే విండీస్ పిచ్లు స్పిన్ ఫ్రెండ్లీ. మిడిల్ ఓవర్లలో స్పిన్ను ఎదుర్కోవడం చాలా కష్టం. స్పిన్నర్లతో డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయించే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు. భారత్ నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పెసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Pakistan Team: టీ20 ప్రపంచకప్ కోసం చెత్త జట్టును ఎంపిక చేశారు: పాక్ మాజీ క్రికెటర్
కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ… ‘విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. భారత్ తుది జట్టులో తప్పకుండా నలుగురు స్పిన్నర్లు ఉంటారనుకుంటున్నా. టీ20 ఫార్మాట్లో బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ చాలా కీలకం. ఏమాత్రం గతి తప్పినా.. బ్యాటర్లు షాట్స్ ఆడేస్తారు. గతేడాది విండీస్తో టీ20 సిరీస్ ఆడిన అనుభవం నాకు కలిసొస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ పిచ్ల్లో పెద్దగా తేడా లేదని అనుకుంటున్నా’ అని చెప్పాడు. గ్రూప్ దశలో ఆడని కుల్దీప్.. సూపర్-8లో ఆడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 20న అఫ్గాన్తో భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!