T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ తలపడబోతుంది. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించని పాక్.. ఇప్పుడు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించుకునే పరిస్థితిలో ఉంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టుకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్గా మారింది.
ఇంగ్లండ్ గెలుపుతో ఊరట:
పాకిస్థాన్కు బిగ్ రిలీఫ్ లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టీమ్ ని ఇంగ్లాండ్ ఓడించింది. దీంతో సూపర్-8 గ్రూప్-2లో సెమీఫైనల్ పోటీ చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠగా మారింది.
Read Also: Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
శ్రీలంకతో కీలక సమరం
నేడు శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మధ్య కీలక పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్ పల్లెకెల అంతర్జాతీయ స్టేడియంలో జగనుంది. ఈ ఒక్క మ్యాచ్ ఫలితమే పాక్ జట్టు భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ కి అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
పాకిస్థాన్ సెమీఫైనల్కు ఎలా చేరాలి?:
పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్లలోనే కాదు, నెట్ రన్ రేట్లో కూడా న్యూజిలాండ్ కంటే చాలా వెనుకబడి ఉంది. కాబట్టి శ్రీలంకపై కేవలం విజయం సాధించడంతోనే సరిపోదు.. భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
Read Also: RTC Bus-Lorry: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
ICC లెక్కల ప్రకారం:
* పాకిస్థాన్కు ఒక్కటే మార్గం- శ్రీలంకపై భారీ విజయం..
* శ్రీలంకపై 65 పరుగుల కంటే ఎక్కువ తేడాతో పాకిస్థాన్ గెలవాల్సి ఉంటుంది..
* లక్ష్యాన్ని 13 ఓవర్లలోపు టార్గెట్ చేధించాలి.. అప్పుడే పాక్ సెమీఫైనల్కు చేరే అవకాశం..
* ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేకపోతే పాకిస్థాన్ ఇంటికి వెళ్తుంది..
సూపర్-8 గ్రూప్-2 పాయింట్ల పట్టిక:
* ఇంగ్లాండ్- 6 పాయింట్లు (3 మ్యాచ్లు), NRR +1.096
* న్యూజిలాండ్- 3 పాయింట్లు (3 మ్యాచ్లు), NRR +1.390
* పాకిస్థాన్ – 1 పాయింట్ (2 మ్యాచ్లు), NRR -0.461
* శ్రీలంక – 0 పాయింట్లు (2 మ్యాచ్లు), NRR -2.800
