T20 World Cup Semi-Final: భారత్-ఇంగ్లాండ్ మధ్య కీలక ఫైట్.. గెలిస్తేనే ఫైనల్ లేదంటే ఇంటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్కప్లో సూపర్ ఫైట్కు సిద్ధమైంది టీమిండియా.. సెమీస్లో ఇవాళ ఇంగ్లాండ్తో తలపడనుంది.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు దూసుకెళ్లనుండగా.. ఓడితే మాత్రం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. వరుస విజయాలతో దూకుడుమీదున్న రోహిత్ సేవ.. ఫుల్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతుంది.. ఇక, 15 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్కప్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంది.. ఇవాళ్టి మ్యాచ్లో ఇంగ్లాండ్డ్ను మట్టికరిపించి ఫైనల్కు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లలో టీమిండియా అదరగొట్టింది.. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా దుమ్మురేపుతోంది.. దీంతో.. అడిలైడ్లో హైఓల్టేజ్ మ్యాచ్ జరగడం కాయంగా కనిపిస్తోంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
మరోవైపు.. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది పాకిస్థాన్.. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తుచేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది. తొలి సెమీస్లో న్యూజిలాండ్ – పాకిస్థాన్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరిగింది.. అనూహ్య పరిస్థితుల్లో సెమీస్ చేరిన పాక్.. ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్తో దుమ్మురేపింది.. అయితే మొదట బ్యాటింగ్ చేసిన నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.. తర్వాత ఛేజింగ్కు దిగిన పాకిస్థాన్.. మొదటి నుంచి దూకుడుగా ఆడింది.. ఓపెనర్లు చెలరేగిపోయారు.. కేవలం మూడు వికెట్లను మాత్రమే నష్టపోయి.. 19.1 ఓవర్లలోనే 153 పరుగులు చేసి విజయాన్ని అందుకుని.. ఫైనల్లో అడుగుపెట్టారు. మొత్తంగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్ల్లో తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ చేరగా, ఇంగ్లాండ్తో అమీతుమీకి భారత్ అస్త్రశస్ర్తాలతో రెడీ అయిపోయింది.. అన్నీ అనుకూలిస్తే అడిలైడ్లో రోహిత్సేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఐసీసీ మెగాటోర్నీల్లో నాకౌట్ బలహీనతకు చరమగీతం పాడుతూ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమ్ఇండియా ఆరాటపడుతున్నది. సూపర్-12లో వరుస విజయాల జోరును కొనసాగిస్తూ కీలకమైన సెమీస్లో ఇంగ్లాండ్ను ఓడించేందుకు భారత్ పక్కా స్కెచ్ వేస్తోంది.. మరోవైపు మెగాటోర్నీలో పడుతూలేస్తున్న ఇంగ్లాండ్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఐర్లాండ్తో అనూహ్య ఓటమితో కంగుతిన్న బట్లర్ గ్యాంగ్.. న్యూజిలాండ్, శ్రీలంకపై విజయాలతో నాకౌట్ బెర్తు దక్కించుకుంది. ఆల్రౌండర్లతో పేపర్పై బలంగా కనిపిస్తున్న ఇంగ్లీష్ జట్టు.. టీమిండియాకు పోటీనిచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఈ మ్యాచ్లో భారత్: రోహిత్శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్పాండ్యా, కార్తీక్/పంత్, అక్షర్పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్సింగ్తో బరిలోకి దిగే అవకాశం ఉండగా.. ఇంగ్లండ్ మాత్రం బట్లర్(కెప్టెన్), హేల్స్, మలన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరాన్, వోక్స్, జోర్డాన్, అదిల్ రషీద్కు తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?