టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు.
పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఐసీసీ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందన్న దానిపై ఆసక్తి పెరిగింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉండగా.. శ్రీలంకతో కలిసి భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం వహిస్తోంది. భారత్–పాక్ మ్యాచ్ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ ముందుగానే నిర్ణయించింది. ముంబైలో మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా మైండ్సెట్ చాలా క్లియర్. మేము పాక్తో ఆడేందుకు ఎప్పుడూ నిరాకరించలేదు. పాక్ వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఫిక్చర్ ఇచ్చింది, ప్రభుత్వాలు న్యూట్రల్ వేదికను నిర్ణయించాయి. కొలంబోకి మా ఫ్లైట్ ఇప్పటికే బుక్ అయింది. మ్యాచ్ కోసం మేము వెళ్తాం కూడా. ఆ తర్వాత ఏమవుతుందో మా చేతుల్లో లేదు’ అని అన్నారు.
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ‘ఉస్తాద్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే.. పాక్ జట్టు రెండు పాయింట్లు కోల్పోయే అవకాశముంది. అయితే దీనికి మించి పీసీబీపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత లేదు. పాకిస్థాన్పై బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఏ టీమ్ కూడా పాక్ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే పీఎస్ఎస్ టోర్నీలో కూడా విదేశీ ప్లేయర్స్ ఆడకుండా కూడా ఐసీసీ బ్యాన్ చేయనుంది. మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఈ వివాదం చోటుచేసుకోవడంతో.. టీ20 వరల్డ్ కప్ 2026పై ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
