క్రికెట్ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ లసిత్ మలింగ… తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు లసిత్ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్ మలింగ. తాను క్రికెట్ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని స్పష్టం చేశాడు లసిత్ మలింగ.
17 ఏళ్ల క్రికెట్ అనుభవం తో కుర్ర క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు 30 టెస్ట్లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్ లు, అలాగే.. 122 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు లసిత్ మలింగ. అంతేకాదు… తన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 500 పైగా వికెట్లు పడగొట్టి… చరిత్ర లో నిలిచాడు. కాగా.. ఇటీవలే దక్షిణఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్.. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
