India vs Sri Lanka 2nd ODI: భారత బౌలర్ల ధాటికి శ్రీలంక చిత్తు.. 215 పరుగులకి ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka All Out For 215 Runs Against India In Second ODI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదట్లో శ్రీలంక శుభారంభమే చేసింది. ఓపెనర్ ఫెర్నాండో (20) ఆరవ ఓవర్లో 29 పరుగుల వద్ద ఔటైనా.. ఆ తర్వాత నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిస్ (34) కలిసి అద్భుతంగా రాణించారు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. వరుస బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్కి 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు జోరు చైసి.. ఈసారి శ్రీలంక జట్టు భారత్కి భారీ టార్గెట్ నిర్దేశించొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. మెండిస్ ఔటయ్యాక ఆ అంచనాలు బోల్తా కొట్టేశాయి.
Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్
Also Read
- CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
- Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
- IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
- Vaibhav Sooryavanshi: "సిక్సర్ల సునామీ".. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
ఎందుకంటే.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లవ్వరూ పెద్దగా రాణించలేదు. క్రీజులో కాసేపు కూడా కుదురుకోలేకపోయారు. దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దసున షణక సైతం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా ఆటగాళ్లందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టడంతో.. శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా పెద్దగా సత్తా చాటలేకపోయారు. భారత్ ముందున్నది స్వల్ప లక్ష్యమే కాబట్టి, ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచి, భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తే చాలు, మ్యాచ్ సహా సిరీస్ కూడా భారత్దే!
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్ట్ పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. బీజేపీ మద్దతు..
తాజావార్తలు
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
-
P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
-
Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా
-
Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్