India vs Sri Lanka 2nd ODI: భారత బౌలర్ల ధాటికి శ్రీలంక చిత్తు.. 215 పరుగులకి ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka All Out For 215 Runs Against India In Second ODI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదట్లో శ్రీలంక శుభారంభమే చేసింది. ఓపెనర్ ఫెర్నాండో (20) ఆరవ ఓవర్లో 29 పరుగుల వద్ద ఔటైనా.. ఆ తర్వాత నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిస్ (34) కలిసి అద్భుతంగా రాణించారు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. వరుస బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్కి 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు జోరు చైసి.. ఈసారి శ్రీలంక జట్టు భారత్కి భారీ టార్గెట్ నిర్దేశించొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. మెండిస్ ఔటయ్యాక ఆ అంచనాలు బోల్తా కొట్టేశాయి.
Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
- Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? 'అతడిని బయటకు పంపండి' అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
ఎందుకంటే.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లవ్వరూ పెద్దగా రాణించలేదు. క్రీజులో కాసేపు కూడా కుదురుకోలేకపోయారు. దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దసున షణక సైతం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా ఆటగాళ్లందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టడంతో.. శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా పెద్దగా సత్తా చాటలేకపోయారు. భారత్ ముందున్నది స్వల్ప లక్ష్యమే కాబట్టి, ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచి, భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తే చాలు, మ్యాచ్ సహా సిరీస్ కూడా భారత్దే!
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్ట్ పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. బీజేపీ మద్దతు..
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!