NTV Telugu Site icon

కోహ్లీనే కావాలని అడిగాడు : గంగూలీ

2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు మూడు ఏళ్ళు వైట్ బల్ క్రికెట్ ఆడని అశ్విన్ ను తిరిగి ఏకంగా ప్రపంచ కప్ కు ఎలా ఎంపిక చేసారు అనేది అందరికి ప్రశ్నగా మారింది.

అయితే తాజాగా ఈ ప్రశ్న పై బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ ప్రపంచ కప్ లో జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఒత్తిడి మేరకే అశ్విన్‌ ను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఆ సమయంలో అశ్విన్ ను ఎంపిక చేయకుండా ఉండటానికి నాకు కూడా కారణాలు కనిపించలేదు. అతను టీం ఇండియాకు టెస్టులో అలాగే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అతను అద్భుతాలు చేస్తాడని నేను భావించాను అని గంగూలీ చెప్పారు.