RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ 2026 సంవత్సరానికి గాను క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత పురుషుల క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ లేదా ప్రస్తుత కెప్టెన్ గిల్లకు చోటు దక్కలేదు. అయితే.. భారతదేశం నుండి ఏకైక ప్రతినిధిగా భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధాన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది.
అరుదైన రికార్డుల స్మృతి..
29 ఏళ్ల స్మృతి మంధాన ప్రస్తుతం మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతోంది. ఆమె కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అర్థశతకాలు (34) చేసిన రికార్డు ఆమె పేరిట ఉంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4,401) చేసిన రెండో క్రికెటర్గా, వన్డేల్లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. దేశీయ వన్డే మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ మంధాన కావడం విశేషం. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. ఆమె మొత్తం 17 అంతర్జాతీయ సెంచరీలు సాధించింది.
Also Read
- Shreyas Iyer Record: అరుదైన జాబితాలో 'సర్పంచ్ సాబ్'.. ఏకంగా మూడుసార్లు!
- Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
- Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
- Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
టైమ్ మ్యాగజైన్ ప్రశంసలు..
స్మృతి మంధాన నాయకత్వ ప్రతిభను కూడా టైమ్ మ్యాగజైన్ కొనియాడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ 2024, 2026 లలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిళ్లను ఆమె గెలిపించింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్గా సేవలు అందించింది. 2025 వన్డే వరల్డ్ కప్లో 9 మ్యాచ్ల్లో 434 పరుగులు చేసి, ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా మితాలీ రాజ్ (409 పరుగులు) రికార్డును బద్దలు కొట్టింది.
ప్రపంచ దిగ్గజాల సరసన..
ఈ టైమ్ 100 జాబితాలో స్మృతి మంధానతో పాటు ఫుట్బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బావుమా వంటి ప్రపంచ స్థాయి క్రీడా ప్రముఖులు ఉన్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మంధాన ఇప్పటికే రెండుసార్లు ఐసీసీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఆమె ఇప్పటివరకు 167 టీ20లు, 120 వన్డేలు, 8 టెస్ట్ మ్యాచ్లు ఆడింది.
తాజావార్తలు
-
Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!