T20 World Cup: టీ20లలో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 2016లో అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ ఆరు అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2021లో ఉగాండా బౌలర్ దినేష్ నక్రానీ ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లను అందుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా క్వాలిఫయింగ్ మ్యాచ్లతో కలిపి ఈ ఒక్క ప్రపంచకప్లోనే సికిందర్ రజాకు మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు.
Read Also: Suryakumar Yadav: రిజ్వాన్ రికార్డ్ బ్రేక్.. అగ్రస్థానంలోకి సూర్య
Also Read
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
కాగా క్రికెట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదని ఇవాళ్టి మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. బలమైన పేస్ దళం, నెంబర్ 1 బ్యాటర్ రిజ్వాన్, పరుగుల వరద పారించే బాబర్ ఆజమ్ ఉన్న పాకిస్థాన్ జట్టును జింబాబ్వే జట్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో మరపురాని విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఐర్లాండ్ జట్టు కూడా ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఇప్పటివరకు రెండు సంచలనాలు నమోదైన ఈ ప్రపంచకప్లో మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!