Shubman Gill: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా 22 ఏళ్ల వయసులోనే విదేశీ గడ్డపై బ్యాక్ టు బ్యాక్ వన్డే సిరీస్లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన టీమిండియా ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో కూడా గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో గిల్ మొత్తం 245 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. గిల్ ప్రతిభావంతుడైన క్రికెటర్ అని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు.
Read Also: Team India: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా.. ఆసియా కప్కు దూరం?
అటు ఈ సిరీస్లో తన బ్యాటింగ్ గురించి గిల్ మాట్లాడుతూ.. తాను డాట్ బాల్స్ పర్సంటేజీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని.. వీలైనంత వరకు గ్యాప్లలో బంతిని తరలించేందుకు చూశానని తెలిపాడు. నిలదొక్కుకుంటే ఎటాకింగ్ గేమ్ ఎలా ఆడాలో తనకు తెలుసు అని.. అందుకే హాఫ్ సెంచరీ పూర్తయ్యాక జింబాబ్వే బౌలర్లపై అటాకింగ్కు దిగినట్లు వెల్లడించాడు. కాగా తన తొలి సెంచరీని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు గిల్ పేర్కొన్నాడు. ‘మా నాన్న నా ప్రైమరీ కోచ్. నేను రెండో వన్డేలో ఔట్ అయ్యాక మా నాన్న నాతో చాలా సేపు మాట్లాడాడు. బేటా నువ్వు చేసిన మిస్టేక్స్ ఇవి.. సరిదిద్దుకో అంటూ చెప్పారు. అది నాకు ఉపయోగపడింది. కాబట్టి ఈ సెంచరీని మా నాన్నకే అంకితం చేస్తున్నాను’ అని గిల్ పేర్కొన్నాడు.