Rohit Sharma Retirement: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..
- రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..
- 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాను..
- ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలని అనిపించింది: రోహిత్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి తర్వాత తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో రోహిత్ నాయకత్వంలోని భారత్ దూకుడు కొనసాగించింది. లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించిన భారత్, కీలక మ్యాచ్లో మాత్రం తడబడింది. 241 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ప్రపంచకప్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Read Also: Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ఇక, నిన్న (డిసెంబర్ 21న) జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్.. ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో పూర్తిగా కుంగిపోయానని చెప్పుకొచ్చారు. మళ్లీ నన్ను నేను సరి చేసుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది అని భావోద్వేగానికి గురయ్యాడు. అయితే, ఆ సమయంలోనే 2024 టీ20 ప్రపంచకప్ తన ముందుందని గ్రహించి దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. “ఇప్పుడు ఈ మాటలు చెప్పడం ఈజీగా అనిపించొచ్చు కానీ ఆ సమయంలో చాలా కష్టంగా ఉందన్నారు. ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలని కూడా అనిపించింది.. క్రికెట్ నా నుంచి అన్నింటినీ తీసుకెళ్లింది అనిపించిందని రోహిత్ అన్నారు.
Read Also: Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
అయితే, ఏడాది లోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2024 టీ20 ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నాను.. ఆ విజయం అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశా.. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే భారత్ మరో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను దక్కించుకుంది.
Read Also: Palnadu M*urder Case: పల్నాడులో దారుణం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
కాగా, వన్డే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతారని భావించిన రోహిత్కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ రోహిత్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. ప్రస్తుతం రోహిత్ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అంచనా. ఈలోగా, విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ముంబై జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి దిగేందుకు రోహిత్ రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..