Rohit Sharma Retirement: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..
- రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..
- 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాను..
- ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలని అనిపించింది: రోహిత్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి తర్వాత తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో రోహిత్ నాయకత్వంలోని భారత్ దూకుడు కొనసాగించింది. లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించిన భారత్, కీలక మ్యాచ్లో మాత్రం తడబడింది. 241 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ప్రపంచకప్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Read Also: Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ఇక, నిన్న (డిసెంబర్ 21న) జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్.. ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో పూర్తిగా కుంగిపోయానని చెప్పుకొచ్చారు. మళ్లీ నన్ను నేను సరి చేసుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది అని భావోద్వేగానికి గురయ్యాడు. అయితే, ఆ సమయంలోనే 2024 టీ20 ప్రపంచకప్ తన ముందుందని గ్రహించి దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. “ఇప్పుడు ఈ మాటలు చెప్పడం ఈజీగా అనిపించొచ్చు కానీ ఆ సమయంలో చాలా కష్టంగా ఉందన్నారు. ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలని కూడా అనిపించింది.. క్రికెట్ నా నుంచి అన్నింటినీ తీసుకెళ్లింది అనిపించిందని రోహిత్ అన్నారు.
Read Also: Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
అయితే, ఏడాది లోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2024 టీ20 ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నాను.. ఆ విజయం అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశా.. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే భారత్ మరో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను దక్కించుకుంది.
Read Also: Palnadu M*urder Case: పల్నాడులో దారుణం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
కాగా, వన్డే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతారని భావించిన రోహిత్కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ రోహిత్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. ప్రస్తుతం రోహిత్ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అంచనా. ఈలోగా, విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ముంబై జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి దిగేందుకు రోహిత్ రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!