Jaiswal vs Gill: టీమిండియాలో విభేదాలు.. గిల్, జైస్వాల్ మధ్య మాటల యుద్ధం
- టీమిండియా టెస్టు జట్టులో బయటపడ్డ విభేదాలు..
- రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్ వర్సెస్ శుభ్ మన్ గిల్..
- కెప్టెన్ గిల్ తో కుదరని కోఆర్డినేషన్.. జైస్వాల్ రనౌట్..
- గిల్ పై స్టేడియంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన యశస్వి జైస్వాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaiswal vs Gill: టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డబుల్ సెంచరీ చేసే అవకాశం కళ్ల ముందు చేజారితే ఏ బ్యాటర్కైనా కోసం రావడం సహజం. వెస్టిండీస్తో రెండో టెస్టు తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వీ జైస్వాల్ (175) ఈరోజు కూడా మంచి జోష్లో ఉన్నాడు. అయితే, విండీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ, రనౌట్ రూపంలో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్లో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్పై జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రిండింగ్ అవుతున్నాయి. గిల్ పరుగు కోసం రాకపోవడంతోనే ఔటైన యశస్వీ.. చేతితో తలను కొట్టుకుంటూ స్టేడియం వీడాడు.
Read Also: Nobel Peace Prize: రాహుల్ గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడే..? కారణం చెప్పిన కాంగ్రెస్ నేత..!
Also Read
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
అయితే, ఇన్నింగ్స్ 92వ ఓవర్ను జైదెన్ సీలెస్ వేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో.. అప్పటికే సగం పిచ్కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు. రనౌట్ తర్వాత గిల్ పై ఇట్స్ మై కాల్ అంటూ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. క్రీజులోనే అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయాడు. కాగా, శుభ్ మన్ గిల్ తీరుపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. గిల్ తప్పిదం వల్లే జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 74 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు, భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 518 పరుగులకు ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్, కెప్టెన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోయారు.
Shubman Gill had a chance to be a good captain today but he failed to do so, resulting in Yashasvi Jaiswal being run out.💔😭 pic.twitter.com/9b5csGWbqD
— CricSachin (@Sachin_Gandhi7) October 11, 2025
తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!