NTV Telugu Site icon

సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్… ఆ స్థానంలో..?

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ కారణంగా అతను ఈ టెస్ట్ సిరీస్ నుండి తొలగించబడినట్లు తెలిపింది.

Read Also : ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది…

అలాగే అతని స్థానంలో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోనే ఉన్న భారత ఏ జట్టుకు న్యాయకత్వం వహిస్తున్న ప్రియాంక్ పంచాల్… భారత సీనియర్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ మంచి ఫామ్ కనపరిచిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే రహానే నుంచి అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అందాయి. ఇక ఇప్పుడు రోహిత్ వెళ్లిపోవడంతో ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ తో పాటుగా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.