Prithvi Shaw: బీసీసీఐకి కౌంటర్.. సాయిబాబా ఫోటో పోస్ట్ చేసిన పృథ్వీ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే, టీ20 సిరీస్లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా విశేషంగా రాణించాడు. ఏడు మ్యాచుల్లో 47.50 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడి స్ట్రైక్ రేటు 191.28గా ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నటిప్పటికీ పృథ్వీ షాకు టీమ్లో చోటు దక్కకపోవడంపై పలువురు క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు సెలక్టర్ల తీరుపై పృథ్వీ షా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
తాను అద్భుతంగా ఆడుతున్నా తనను సెలెక్టర్లు పక్కనపెట్టడం నిరాశను కలిగించిందని గతంలోనే పృథ్వీ షా ఆరోపించాడు. టీ20 ప్రపంచకప్కు తనను ఎంపిక చేయకపోవడాన్ని నేరుగా తప్పుబట్టాడు. తాను కష్టపడుతున్నా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్లకు పరుగులు చేయడమే ముఖ్యమని, ఆ విషయంలో తాను ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నానని.. అయినా తనను పక్కనపెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్లకు ఎంపిక చేయకపోవడాన్ని కూడా పృథ్వీ షా మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు.
Also Read
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
Read Also: CPI Narayana US Tour: ఆ ఫోటోతో అమెరికాలో చేదు అనుభవం.. షాకైన నారాయణ
ఈ సందర్భంగా ‘నువ్వు అన్నీ చూస్తున్నావని ఆశిస్తున్నా’ అని సాయిబాబా ఫొటోను పృథ్వీ షా పోస్టు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. పలువురు క్రికెట్ అభిమానులు షాకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అటు న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్లకు తనను ఎంపిక చేయకపోవడాన్ని ఉమేష్ యాదవ్ కూడా తప్పుబట్టాడు. ‘నువ్వు నన్ను ఫూల్ చేయొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త’ అని ఉమేష్ పోస్ట్ చేశాడు. మరోవైపు నితీష్ రాణా, రవి బిష్ణోయ్ కూడా సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘HOPE’ అని రాణా, సెట్బ్యాక్ కంటే కమ్బ్యాక్ బలమైందని రవి బిష్ణోయ్ పోస్టులు చేశారు.

తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..