Asia Cup : అలా అయితే మేం ఇండియాకు రాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఆసియా కప్ వివాదం కొద్దిరోజుల క్రితమే సద్దుమణిగిందని అనుకుంటున్న ప్రతీసారి ఇది రావణకాష్టంలా రగులుతూనే ఉంది. భద్రతా కారణాల నేపథ్యంలో తాము పాకిస్తాన్ కు రాబోమని.. తటస్థ వేదికలపై అయితేనే ఆసియా కప్ ఆడతామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తేల్చి చెప్పింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినా పాకిస్తాన్ క్రికెట్ లో మాత్రం ఈ వివాదం కొనసాగుతునే ఉంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మాజీ సీఈవో, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మేనేజర్ ఆఫ్ క్రికెట్ వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలతో మళ్లీ వివాదం చెలరేగుతుంది.
Also Read : Amritpal Singh: స్వర్ణ దేవాలయం వద్ద లొంగిపోనున్న అమృత్ పాల్ సింగ్.. సిక్కులు యూనిటీ ఉండాలని వీడియో
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
- Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి చర్చ జరుగుతున్న వేళ పాకిస్తాన్ లోని స్థానికంగా ఉన్న ఓ టీవీ ఛానెల్ తో వసీం ఖాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుండా తటస్థ వేదికలపైనే ఆడతామని చెబుతుంటూ తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లేది లేదని, తాము ఆడే మ్యాచ్ లకూ న్యూట్రల్ వేదికలు కావాలని డిమాండ్ చేశారు. వసీం ఖాన్ వ్యాఖ్యలకు తోడు ఆసియా కప్ నిర్వహణ వివాదంపై గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆటగాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇండియన్ టీమ్ పాకిస్తాన్ కు వచ్చేందుకు వణుకు పుడుతుందని పాక్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ కామెంట్స్ చేశాడు.
Also Read : Rahul Gandhi: ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలతో అనర్హుడయ్యాడో.. అక్కడి నుంచే రాహుల్ ప్రచారం..
అసలు విషయం చెప్పకుండా భద్రత లోపం అంటూ కుంటి సాకులు చెబుతుందంటూ ఇమ్రాన్ నజీర్ విమర్శించాడు. ఇదిలా ఉండగా ఈ వివాదం మొదలైన కొత్తలో పీసీబీ కూడా ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుంటే మేం కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు రాబోము అంటూ హెచ్చరించింది. దీనిపై గతంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ రాకున్న వన్డే వరల్డ్ కప్ కు ఏ లోటూ ఉండదని భారత్ కు వచ్చిన దేశాలతోనే ఈ టోర్నీని ఘనంగా నిర్వహిస్తామని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!