Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టును వెంటాడుతున్న కష్టాలు.. జీతాల్లో కోత!
- గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు..
- జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న పాక్ క్రికెట్ బోర్డు..
- ప్లేయర్స్ తీసుకునే జీతాలపై పీసీబీ కోతలు విధించేందుకు రెడీ..
Pakistan: ఫార్మాట్తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన పాక్ కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. అలాగే, ఇప్పటి వరకు ఆడిన 11 వన్డేల్లో తొమ్మిదింట్లో ఓడిపోయింది. ఇక, టీ20ల్లో మెన్ ఇన్ గ్రీన్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. 14 మ్యాచ్లు ఆడగా ఏడింట్లో గెలిచింది. కానీ, దాయాది జట్టు ప్రదర్శన పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్లేయర్స్ తీసుకునే జీతాలపై పీసీబీ కోతలు విధించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ చేసుకున్న ఆటగాళ్లకు ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో 3 శాతం వాటాను బోనస్గా అందజేస్తుంది. ఇక, వచ్చే ఏడాది నుంచి ఆ మూడు శాతం వాటాను కట్ చేయాలని పీసీబీ భావిస్తుందంట.
Read Also: సీపీఐ నారాయణ : అమరవీరులకు ద్రోహం చేసేలా మోదీ మాట్లాడారు!
Also Read
- Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
- KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
అయితే, రెండేళ్ల క్రితం కొందరు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ ఐసీసీ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పీసీబీపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే 3 శాతం వాటాను వారికి ఇస్తుంది. కానీ, ఇప్పుడు జట్టు పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో దాయాది దేశ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు రెడీ అయింది. అలాగే, ఇప్పటికే ఆటగాళ్ల జీతాలను కూడా పెంచే యోచనలో లేనట్లు సమాచారం.
Read Also: NTV Telugu Podcast: నండూరి శ్రీనివాస్ తో ఎన్టీవీ స్పెషల్ పాడ్కాస్ట్..
పాక్ ఆటగాళ్ల జీతాలు..?
ఇక, ప్రస్తుతం పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్న ప్లేయర్స్ కు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు ( భారత కరెన్సీలో ఏడాదికి కోటిన్నర రూపాయలు) ఇస్తుంది. అలాగే, ఐసీసీ వాటా నుంచి 2.07 మిలియన్లు లభిస్తున్నాయి. మొత్తంగా ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్ల పైగా డబ్బులను అందుకుంటున్నారు. కేటగిరీ బీలో ఉన్న ప్లేయర్స్ కు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు అందజేస్తున్నారు. ఈ కేటగిరిలో ఉన్న వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లకుపైగా ఇస్తున్నారు. కేటగిరి సీలోని వారికి మొత్తం 7లక్షలు అందజేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!