Women’s IPL: ఫ్రాంచైజీ రేసులో 30 కంపెనీలు..బీసీసీఐకి కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s IPL: మహిళా క్రికెటర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమెన్స్ ఐపీఎల్కు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా మొత్తం 30 సంస్థలు టెండర్ దరఖాస్తులు కొనుగోలు చేశాయి. మహిళల ఐపీఎల్ మొదటి సీజన్లో ఐదు జట్లు పోటీ పడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్బాల్ లీగ్కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉండటం గమనార్హం. ఫ్రాంచైజీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జనవరి 21) ముగియనుండగా.. హల్దీరామ్స్ ఇటీవలే టెండర్ దాఖలు చేసింది. మహిళ ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం పది భారత నగరాలు, వేదికలతో బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. సంస్థలు సింగిల్గా.. ఒకటి కంటే ఎక్కువ నగరాలకు బిడ్ దాఖలు చేసేలా నిబంధనలు విధించింది. ఇందుకోసం ఎలాంటి ప్రాథమిక ధరను నిర్ణయించలేదు. ఈ బిడ్లు పదేళ్ల కాలానికి అమల్లో ఉంటాయని పేర్కొంది.
పోటీలో ఎవరున్నారంటే..
Also Read
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
పురుషుల ఐపీఎల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పది ఫ్రాంచైజీలు మహిళల లీగ్కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేశాయి. అదానీ (గల్ఫ్ జెయింట్స్), కాప్రి గ్లోబల్ (షార్జా వారియర్స్) కూడా టెండర్ వేయనున్నాయి. సిమెంట్ కంపెనీలు చెట్టినాడ్ సిమెంట్, జేకే సిమెంట్లూ ఫ్రాంచైజీ కొనుగోలు పట్ల ఆసక్తితో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు స్పోర్ట్స్ లీగ్ల్లో ఆసక్తి కనబర్చని శ్రీరామ్ గ్రూప్, నీలగిరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్ కూడా రేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సంయుక్త యజమానులైన తెలుగు సంస్థ జీఎంఆర్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ వేర్వేరుగా టెండర్ డాక్యుమెంట్లు తీసుకోవడం గమనార్హం. ఏపీఎల్ అపోలో, హల్దీరామ్ జట్టును కొనుగోలు చేసేందుకు ఉత్సాహంతో ఉన్నాయి.సీల్డ్ బిడ్లను జనవరి 25న ఓపెన్ చేసి బీసీసీఐ ఫ్రాంచైజీ విన్నర్లను ప్రకటించనుంది.
Mohan Raja : భాషతో సంబంధం లేదు.. భావమే ముఖ్యం
తాజావార్తలు
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..