Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhat Zareen Won Gold Medal In Women World Boxing Championship 2023: భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. వియత్నాంకు చెందిన థామ్ గుయేన్ను నిఖిత్ 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తనపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ప్రత్యర్థికి ఇవ్వలేదు. రెండో రౌండ్లో వియత్నాం బాక్సర్ కాస్త పుంజుకుంది కానీ, మూడో రౌండ్లో నిఖత్ పూర్తిగా రెచ్చిపోయింది. మూడు నిమిషాల పాటు ఏకధాటిగా ప్రత్యర్థిపై పిడుగుల వర్షం కురిపించింది. దీంతో.. ఈ మ్యాచ్ నిఖత్ వశం కావడంతో, బంగారం గెలిచింది. దీంతో ఆమె రెండోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. భారత బాక్సర్ మేరీకోమ్ తర్వాత వరుసగా రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా నిఖత్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై నెటింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. నిఖిత్ని మెచ్చుకుంటున్నారు.
Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
ఇదిలావుండగా.. మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో భారత్కు ఇది మూడో టైటిల్. శనివారం భారత్కు ఏకంగా రెండు బంగారు పతకాలొచ్చాయి. 81 కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్లో హరియాణాకు చెందిన స్వీటీ బూరా, చైనాకు చెందిన వాంగ్ లినాపై 4-3 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఒకానొక దశలో వాంగ్ లినా ఆధిపత్యం చెలాయించింది. కానీ.. స్వీటీ ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని ఓడించింది. ఇక 48 కిలోల విభాగంలో.. మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్పై నీతూ గాంగాస్ 5-0 తేడాతో విజయఢంకా మోగించింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ (రెండు సార్లు) ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఇప్పుడు వారి సరసన తాజాగా నీతూ, స్వీటీ బూరా చేరిపోయారు.
YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!