Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhat Zareen Won Gold Medal In Women World Boxing Championship 2023: భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. వియత్నాంకు చెందిన థామ్ గుయేన్ను నిఖిత్ 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తనపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ప్రత్యర్థికి ఇవ్వలేదు. రెండో రౌండ్లో వియత్నాం బాక్సర్ కాస్త పుంజుకుంది కానీ, మూడో రౌండ్లో నిఖత్ పూర్తిగా రెచ్చిపోయింది. మూడు నిమిషాల పాటు ఏకధాటిగా ప్రత్యర్థిపై పిడుగుల వర్షం కురిపించింది. దీంతో.. ఈ మ్యాచ్ నిఖత్ వశం కావడంతో, బంగారం గెలిచింది. దీంతో ఆమె రెండోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. భారత బాక్సర్ మేరీకోమ్ తర్వాత వరుసగా రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా నిఖత్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై నెటింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. నిఖిత్ని మెచ్చుకుంటున్నారు.
Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
ఇదిలావుండగా.. మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో భారత్కు ఇది మూడో టైటిల్. శనివారం భారత్కు ఏకంగా రెండు బంగారు పతకాలొచ్చాయి. 81 కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్లో హరియాణాకు చెందిన స్వీటీ బూరా, చైనాకు చెందిన వాంగ్ లినాపై 4-3 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఒకానొక దశలో వాంగ్ లినా ఆధిపత్యం చెలాయించింది. కానీ.. స్వీటీ ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని ఓడించింది. ఇక 48 కిలోల విభాగంలో.. మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్పై నీతూ గాంగాస్ 5-0 తేడాతో విజయఢంకా మోగించింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ (రెండు సార్లు) ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఇప్పుడు వారి సరసన తాజాగా నీతూ, స్వీటీ బూరా చేరిపోయారు.
YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ
తాజావార్తలు
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!