Site icon NTV Telugu

BCCI: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ గుడ్‌న్యూస్..

Virat Kohli Rohit Sharma

Virat Kohli Rohit Sharma

BCCI: తాజాగా, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్‌ చెప్పింది బీసీసీఐ.. అసలు టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఈ స్టార్‌ ఆటగాళ్లు గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌ను కోల్పోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. T20 మరియు టెస్ట్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గ్రేడ్ A+ కేటగిరీలోనే ఉంటారని స్పష్టం చేశారు.. ఏప్రిల్ ప్రారంభంలో, బీసీసీఐ వార్షిక ప్లేయర్ రిటైనర్‌షిప్ 2024-25ను ప్రకటించిన విషయం విదితమే కాగా.. అందులో కోహ్లీ, రోహిత్‌, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు గ్రేడ్ A+ కేటగిరీలో ఉంచారు. అయితే, టీ20, టెస్ట్‌ల నుండి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత క్రికెట్ జట్టులో భాగమే, వారు గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలను పొందుతారు అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.

Read Also: Central Cabinet Decisions: కొత్త ‘చిప్‌’ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

ఐదు మ్యాచ్‌ల ఇంగ్లాండ్ పర్యటనకు ముందు, విరాట్ తన రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు, 14 సంవత్సరాల సుదీర్ఘమైన, 123 మ్యాచ్‌ల పెద్ద కెరీర్‌కు తెర దించాడు. తన టెస్ట్ కెరీర్‌లో, 36 ఏళ్ల కోహ్లీ 123 మ్యాచ్‌లు ఆడి, 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు.. 210 ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు మరియు 31 అర్ధ సెంచరీలు.. 254 అత్యుత్తమ స్కోరుతో సాధించాడు.. సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265 పరుగులు), సునీల్ గవాస్కర్ (10,122 పరుగులు) తర్వాత ఈ ఫార్మాట్‌లో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా రికార్టు సృష్టించాడు..

Read Also: AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!

ఇక, మే 7న, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు, 67 టెస్టులు మరియు 11 సంవత్సరాల కెరీర్ తర్వాత, రోహిత్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.. 12 సెంచరీలు మరియు 18 అర్ధ సెంచరీలు.. 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు రోహిత్. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన చిరస్మరణీయ స్వదేశీ సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 212.. ఈ ఫార్మాట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన 16వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.. 2024లో, T20 ప్రపంచ కప్ పూర్తయిన తర్వాత విరాట్, రోహిత్ ఆ అంతర్జాతీయ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిసన విషయం తెలిసిందే..

Read Also: Star Kids : హీరోలుగా కాదు.. దర్శకులుగా మారుతోన్న స్టార్ కిడ్స్

35 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో, విరాట్ 58.72 సగటు.. 128.81 స్ట్రైక్ రేట్‌తో 1,292 పరుగులు చేశాడు, 15 అర్ధ సెంచరీలు.. ఈ ఫార్మాట్‌లో అతని ఉత్తమ స్కోరు 89.. టోర్నమెంట్ చరిత్రలో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.. 125 టీ20 మ్యాచ్‌ల్లో, విరాట్ 48.69 సగటు మరియు 137.04 స్ట్రైక్ రేట్‌తో 4,188 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ మరియు 38 అర్ధ సెంచరీలు సాధించాడు, 122 అత్యుత్తమ స్కోరు చేశాడు. అతను అన్ని కాలాలలో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఫార్మాట్‌ను ముగించాడు. మరోవైపు, 151 టీ20 మ్యాచ్‌ల్లో, రోహిత్ 32.05 సగటుతో 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 4,231 పరుగులు చేశాడు. అతను తన కెరీర్‌లో ఐదు సెంచరీలు మరియు 32 అర్ధ సెంచరీలు చేశాడు, అత్యుత్తమ స్కోరు 121 కాగా.. ఈ ఫార్మాట్‌లో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచారు..

Exit mobile version