APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత పోరులో తుంగభద్ర వారియర్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఆరంభంలో మంచి ప్రదర్శన కనబరిచింది. తొలి 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే చివరి దశలో తుంగభద్ర బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు.
రాయలసీమ జట్టులో ధ్రువ్ కుమార్ రెడ్డి అర్థశతకంతో రాణించాడు. అతడు మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు రషీద్ 31 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. తుంగభద్ర బౌలర్లలో సాయి చరణ్, దీపక్ స్టీఫెన్ తలో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు.
Also Read
- Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
- Sachin Tendulkar Viral Video: వర్షంలో చిన్నపిల్లాడిగా మారిపోయిన సచిన్.. వైరల్గా మారిన వీడియో
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
ఇక, 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును పోటీలో నిలిపారు. సూర్య జయంత్ 25 బంతుల్లో 26 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా, రోహిత్ కేవలం 14 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివర్లో సౌరబ్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి అద్భుత ఫినిషింగ్ ఇచ్చాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్తో కీలక సమయంలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు చివరి బంతికి విజయం కోసం అవసరమైన పరుగును సాధించిన తుంగభద్ర వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. దీంతో ఏపీఎల్ 2026 సీజన్-5లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్లో కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన సౌరబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!