MS Dhoni: అభిమానులకు ధోనీ బిస్కెట్.. ఇదేం విషయం అంటూ అభిమానుల సెటైర్లు
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. కమర్షియల్ ప్రకటన కోసం ముందుగా గుడ్ న్యూస్ అని ప్రకటించడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్ను ప్రారంభించినప్పుడు భారత్ ప్రపంచకప్ గెలిచిందని.. ఇప్పుుడ మరోసారి ఓరియో బిస్కెట్ బ్రాండ్ ఆవిష్కరించడంతో ఈ ఏడాది భారత్ ప్రపంచ కప్ గెలుస్తుందని ధోనీ కవర్ చేశాడు.
Read Also:IND Vs AUS: డిసైడర్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా .. బెట్టింగ్ జోరు..!!
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
ఈ సందర్భంగా ధోనీకి అభిమానుల ఎమోషన్స్తో ఆడుకోవడం అలవాటైందని సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ప్రకటనలపై ఉన్న ధ్యాసతో అభిమానులతో ఇలా ఆడుకోవడం పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు. కమర్షియల్ ఆదాయం కోసం అభిమానాన్ని బలిపెట్టొద్దంటూ సూచిస్తున్నారు. అయినా ఓరియో బిస్కెట్ లాంచ్ చేస్తే ఇండియా ప్రపంచ కప్ గెలవడమేంటని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచ కప్లో 11 మంది ఆడితేనే జట్టు గెలుస్తుందని.. ఓరియో బిస్కెట్ ఆవిష్కరించడం వల్లో, తినడం వల్లో ఇండియా గెలవదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో గంగూలీ కూడా ఎడ్యుకేషన్ యాప్ కోసం ఇలాగే హంగామా చేశాడని.. అయినా ఇలాంటి ప్రకటనల కోసం గుడ్ న్యూస్ అంటూ అభిమానుల టైం వేస్ట్ చేయడం సరికాదని ధోనీని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో