Mithali Raj: రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి వారికే ఎక్కువ తెలుస్తుందని పేర్కొంది. బెలిండా క్లార్క్, కానర్ తరహాలో తానూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికలను ఆమె వివరించింది.
బీసీసీఐ పాలక మండలిలో చేరడం తనకిష్టమేనని మిథాలీ తెలిపింది. వేర్వేరు దశల్లో మహిళల జట్టును నడిపించిన అనుభవం తనకుందని వివరించింది. అదే పాలకురాలిగా తనకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ఉంది.
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
‘అవును, పాలకురాలిగా మారడం నాకిష్టమే. అవకాశం వస్తే కచ్చితంగా చేపడతాను. మహిళా క్రికెటర్గా ఎంతో అనుభవం ఉంది. క్రీడాకారిణిగా ఎన్నో దశలను చూశాను. ఆ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది’ అని మిథాలీ తెలిపింది.
‘మహిళల క్రికెట్ గురించి మహిళలే బాగా అర్థం చేసుకుంటారు. అందుకే బోర్డులో వారికి కచ్చితమైన ఓ పొజిషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా వారు జట్టులో, క్రికెట్లో కొనసాగారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ను బెలిండా క్లార్క్ తన అనుభవంతో మెరుగుపరిచింది. ఈసీబీలో క్లేర్ కానార్ ఇదే దారి అనుసరించింది. అందుకే అమ్మాయిల క్రికెట్కు పరిపాలనలో మహిళలు మెరుగ్గా రాణించగలరని నా నమ్మకం’ అని మిథాలీ వివరించింది.
“మైదానంలోని అడుగు పెట్టిన ప్రతిసారీ నేను అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నించాను. భారత్ను గెలిపించేందుకే కష్టపడ్డాను. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా ప్రయాణం ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను’ అని మిథాలీ పేర్కొంది.
మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్. కెరీర్లో ఆమె సాధించని రికార్డుల్లేవ్. అందుకోని ఘనతల్లేవ్. 23 ఏళ్లుగా అమ్మాయిల క్రికెట్కు సేవలందిస్తున్న ఈ టీమ్ఇండియా దిగ్గజం రెండు రోజుల క్రితమే వీడ్కోలు ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ పగ్గాలు ప్రతిభావంతుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. తనకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!