Mithali Raj: రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి వారికే ఎక్కువ తెలుస్తుందని పేర్కొంది. బెలిండా క్లార్క్, కానర్ తరహాలో తానూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికలను ఆమె వివరించింది.
బీసీసీఐ పాలక మండలిలో చేరడం తనకిష్టమేనని మిథాలీ తెలిపింది. వేర్వేరు దశల్లో మహిళల జట్టును నడిపించిన అనుభవం తనకుందని వివరించింది. అదే పాలకురాలిగా తనకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ఉంది.
Also Read
- Daniel Vettori: "పక్కా ప్లాన్తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
- IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
- Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘అవును, పాలకురాలిగా మారడం నాకిష్టమే. అవకాశం వస్తే కచ్చితంగా చేపడతాను. మహిళా క్రికెటర్గా ఎంతో అనుభవం ఉంది. క్రీడాకారిణిగా ఎన్నో దశలను చూశాను. ఆ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది’ అని మిథాలీ తెలిపింది.
‘మహిళల క్రికెట్ గురించి మహిళలే బాగా అర్థం చేసుకుంటారు. అందుకే బోర్డులో వారికి కచ్చితమైన ఓ పొజిషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా వారు జట్టులో, క్రికెట్లో కొనసాగారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ను బెలిండా క్లార్క్ తన అనుభవంతో మెరుగుపరిచింది. ఈసీబీలో క్లేర్ కానార్ ఇదే దారి అనుసరించింది. అందుకే అమ్మాయిల క్రికెట్కు పరిపాలనలో మహిళలు మెరుగ్గా రాణించగలరని నా నమ్మకం’ అని మిథాలీ వివరించింది.
“మైదానంలోని అడుగు పెట్టిన ప్రతిసారీ నేను అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నించాను. భారత్ను గెలిపించేందుకే కష్టపడ్డాను. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా ప్రయాణం ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను’ అని మిథాలీ పేర్కొంది.
మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్. కెరీర్లో ఆమె సాధించని రికార్డుల్లేవ్. అందుకోని ఘనతల్లేవ్. 23 ఏళ్లుగా అమ్మాయిల క్రికెట్కు సేవలందిస్తున్న ఈ టీమ్ఇండియా దిగ్గజం రెండు రోజుల క్రితమే వీడ్కోలు ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ పగ్గాలు ప్రతిభావంతుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. తనకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!