Sunil Chhetri: భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి..
Sunil Chhetri Retirement: ప్రపంచం లో అత్యధికంగా పాపులర్ అయిన ఫుట్ బాల్ భారత దేశంలో పెద్దగా ఆదరణ చూరగొనలేకపోయింది. కానీ ఫుట్ బాల్ ప్రపంచం లో ఈ భారతీయుడి పేరు తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏకంగా అత్యధిక గోల్స్ చేసిన ఫుట్ బాల్ క్రీడాకారులలో క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్ మెస్సి (106) తరువాత స్తానం ఇతని పేరు ఉంది అంటే అది భారత దేశానికే గర్వకారణం అంతటి గణతః సాధించిన టీమ్ ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి నేడు అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
39 ఏళ్ల ఈ ఇండియన్ లెజెండరీ ప్లేయర్.. గురువారం (మే 16) ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. జూన్ 6వ తేదీన కువైట్ తో ఇండియా ఆడబోయే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ తన చివరిదని ప్రకటించాడు. భావోద్వేగంతో ఇండియా తరఫున తాను ఆడిన తొలి మ్యాచ్ ను ఎప్పటికీ మరచిపోలేనని ఈ వీడియోలో సునీల్ ఛెత్రి చెప్పాడు. తొలి మ్యాచ్ లోనే తాను గోల్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. తాను తొలిసారి ఇండియా జెర్సీ వేసుకునే ముందు తెలియకుండానే తాను దానిపై పర్ఫ్యూమ్ కొట్టానని కూడా చెప్పాడు. ఇప్పుడు చివరి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా కెరీర్లో ప్రతి క్షణం గుర్తుకు వస్తోందని తెలిపాడు.
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
Also Read; Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
“ఈ మ్యాచ్ నాకు చివరిది అని నాకు నేను చెప్పుకున్న సమయంలో ప్రతి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మ్యాచ్, ఆ కోచ్, ఈ మ్యాచ్, ఈ టీమ్.. ఇలా అన్నీ గుర్తుకు రావడం వింతగా అనిపించింది. అన్నీ గుర్తుకు వచ్చాయి. దీంతో నేను తుది నిర్ణయం తీసుకున్నాను” అని ఆ వీడియోలో సునీల్ ఛెత్రీ చెప్పాడు.
మొత్తంగా ఇప్పటి వరకూ సునీల్ ఛెత్రీ 150 అంతర్జాతీయ మ్యాచ్ లలో 94 గోల్స్ చేశాడు. అతడు జట్టులో ఉండగానే ఇండియా నెహ్రూ కప్ ను మూడుసార్లు, సాఫ్ ఛాంపియన్షిప్ మూడుసార్లు గెలిచింది. ఇక 2008లో ఏఎఫ్సీ ఛాలెంజ్ కప్ ఇండియా గెలవడంలోనూ ఛెత్రీదే కీలకపాత్ర. ఇతని సేవలకు మెచ్చి భారత సర్కారు అర్జున అవార్డు (2011), పద్మశ్రీ (2019), రాజీవ్ ఖేల్ రత్న (2021) అవార్డులు ఇచ్చి సత్కరించింది.
19ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఫుట్ బాల్ ఆటగాడిగా ఎన్నో మైలు రాళ్లు అందుకుని భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ తరువాత చేయబోయే ప్రతి పనిలో విజయం సాధించాలి అని కోరుకుంటూన్నాం.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!