KKR vs RCB: కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఘోర పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Knight Riders Won By 81 Runs Against Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో.. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. కేకేఆర్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కేకేఆర్ 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలం ముందు.. ఆర్సీబీ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ కూడా నిలకడగా రాణించలేకపోయారు. కెప్టెన్ డు ప్లెసిస్ 23 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడంటే.. ఆర్సీబీ బ్యాటర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా.. ఇలా క్రీజులోకి వచ్చి, అలా పెవిలియన్ బాట పట్టడమే తప్ప ఎవ్వరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు.
Janhvi Kapoor: ఎన్టీఆర్ హీరోయిన్ క్లివేజ్ షో.. ఆ కర్వ్ ఏదైతే ఉందో
Also Read
- RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!

తొలుత టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుర్బాజ్ (57), శార్దూల్ ఠాకూర్ (68), రింకు సింగ్ (46) అద్భుతంగా రాణించడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఒక దశలో కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో.. 150 పరుగులైనా చేస్తుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. అప్పుడు మైదానంలో అడుగుపెట్టిన శార్దూల్.. ఒకటే పరుగుల వర్షం కురిపించాడు. ఎడాపెడా షాట్లతో చెలరేగిపోయాడు. రింకుతో కలిసి ఆరో వికెట్కి 103 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అతని ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే కేకేఆర్ 200 పరుగుల మార్క్ని దాటేసి, 204 స్కోర్ చేయగలిగింది.
KKR vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో ఇదీ పరిస్థితి!
ఇక 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో శుభారంభమే చేసింది. విరాట్ కోహ్లీ (21), డు ప్లెసిస్ (23) కలిపి.. 4 ఓవర్లలోనే 42 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు. ఇది చూసి.. ఛేజింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని, ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకున్నారు. కానీ.. ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో, అప్పటినుంచి ఆర్సీబీ పతనం మొదలైంది. కోహ్లీ, డు ప్లెసిస్ ఔటయ్యాక.. ఇతర బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరూ కూడా కనీస పోరాట పటిమని కనబర్చలేకపోయారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దీంతో.. ఆర్సీబీ 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ 4 వికెట్లు తీయగా.. సుయాశ్ 3, సునీల్ నరైన్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!