Jos Buttler: ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు.. ఉండనివ్వం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్లో భాగంగా ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్లో టీమిండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో తమ జట్టే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండకుండా చేసేందుకు తాము సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నాడు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
అయితే భారత జట్టు బలంగా ఉందని, టీ20 ఫార్మాట్లో చాన్నాళ్ల నుంచి భారత జట్టు నిలకడగా ఆడుతోందని బట్లర్ వివరించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో డెప్త్ ఉందని, ఆ జట్టులో టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారని, ఇండియన్ లైనప్ బాగుందని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ మంచి ఫామ్లో ఉన్నాడని.. అతడు అత్యుత్తమ బ్యాటర్ అని ప్రశంసించాడు. సూర్యకుమార్, కోహ్లీ ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకుంటే టీమిండియా నిలువరించవచ్చని బట్లర్ అభిప్రాయపడ్డాడు. కాగా సెమీఫైనల్కు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లను గాయాల సమస్య వెంటాడుతోంది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్, కోహ్లీ స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదమేమీ లేదని బీసీసీఐ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఇంగ్లండ్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కూడా గాయాల బారిన పడ్డారు. దీంతో వాళ్ల స్థానంలో వేరే ఆటగాళ్లను ఇంగ్లండ్ తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మెడికల్ టీమ్పైన తమకు విశ్వాసం ఉందని.. వాళ్లిద్దరూ సెమీస్కు అందుబాటులో ఉంటారని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!