Jos Buttler: ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు.. ఉండనివ్వం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్లో భాగంగా ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్లో టీమిండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో తమ జట్టే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండకుండా చేసేందుకు తాము సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నాడు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే భారత జట్టు బలంగా ఉందని, టీ20 ఫార్మాట్లో చాన్నాళ్ల నుంచి భారత జట్టు నిలకడగా ఆడుతోందని బట్లర్ వివరించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో డెప్త్ ఉందని, ఆ జట్టులో టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారని, ఇండియన్ లైనప్ బాగుందని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ మంచి ఫామ్లో ఉన్నాడని.. అతడు అత్యుత్తమ బ్యాటర్ అని ప్రశంసించాడు. సూర్యకుమార్, కోహ్లీ ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకుంటే టీమిండియా నిలువరించవచ్చని బట్లర్ అభిప్రాయపడ్డాడు. కాగా సెమీఫైనల్కు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లను గాయాల సమస్య వెంటాడుతోంది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్, కోహ్లీ స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదమేమీ లేదని బీసీసీఐ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఇంగ్లండ్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కూడా గాయాల బారిన పడ్డారు. దీంతో వాళ్ల స్థానంలో వేరే ఆటగాళ్లను ఇంగ్లండ్ తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మెడికల్ టీమ్పైన తమకు విశ్వాసం ఉందని.. వాళ్లిద్దరూ సెమీస్కు అందుబాటులో ఉంటారని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!