Ravindra Jadeja: గాయం నుంచి కోలుకున్న జడేజా.. కెప్టెన్గా రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. నేషనల్ టీమ్లోకి రావడానికి ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తొలుత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. అంతేకాదు వచ్చీ రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. మంగళవారం (జనవరి 24) నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీమ్కు జడేజా కెప్టెన్గా ఉండనున్నాడు. ప్రస్తుత కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో జడేజాకు సారథ్యం వహించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రం ‘వనక్కం చెన్నై’ అంటూ జడ్డూ ఓ ట్వీట్ చేయగా.. అది వైరల్ అయింది. ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడతాడన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై జడేజాకు సెకండ్ హోమ్గా మారిపోయింది. అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్ బ్యాక్ మ్యాచ్ ఆడుతుండటంతో పాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు. ఇక 2019-20 రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీమ్ మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్కు ఉనద్కత్తో పాటు వెటరన్ బ్యాటర్ పుజారాకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
Also Read
- US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్గా మరో రికార్డు..
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
గతేడాది ఆగస్ట్లో మోకాలి గాయం కారణంగా క్రికెట్కు దూరమైన జడేజా మళ్లీ ఇన్నాళ్లకు కాంపిటీటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. అంతేకాదు 2018 నవంబర్ తర్వాత జడేజా ఆడుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇదే. అతడు ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్కు ముందు ఈ మ్యాచ్ జడేజాకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఈ రంజీ ట్రోఫీ సీజన్లో తమ గ్రూప్లో సౌరాష్ట్ర 26 పాయింట్లతో టాప్లో కొనసాగుతోం ది. అయితే సొంతగడ్డపై ఆంధ్రాతో జరిగిన తమ చివరి మ్యాచ్లో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ టాపర్గా ఉన్న సౌరాష్ట్ర ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది.
తాజావార్తలు
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!