Ravindra Jadeja: గాయం నుంచి కోలుకున్న జడేజా.. కెప్టెన్గా రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. నేషనల్ టీమ్లోకి రావడానికి ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తొలుత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. అంతేకాదు వచ్చీ రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. మంగళవారం (జనవరి 24) నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీమ్కు జడేజా కెప్టెన్గా ఉండనున్నాడు. ప్రస్తుత కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో జడేజాకు సారథ్యం వహించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రం ‘వనక్కం చెన్నై’ అంటూ జడ్డూ ఓ ట్వీట్ చేయగా.. అది వైరల్ అయింది. ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడతాడన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై జడేజాకు సెకండ్ హోమ్గా మారిపోయింది. అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్ బ్యాక్ మ్యాచ్ ఆడుతుండటంతో పాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు. ఇక 2019-20 రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీమ్ మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్కు ఉనద్కత్తో పాటు వెటరన్ బ్యాటర్ పుజారాకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
Also Read
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
గతేడాది ఆగస్ట్లో మోకాలి గాయం కారణంగా క్రికెట్కు దూరమైన జడేజా మళ్లీ ఇన్నాళ్లకు కాంపిటీటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. అంతేకాదు 2018 నవంబర్ తర్వాత జడేజా ఆడుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇదే. అతడు ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్కు ముందు ఈ మ్యాచ్ జడేజాకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఈ రంజీ ట్రోఫీ సీజన్లో తమ గ్రూప్లో సౌరాష్ట్ర 26 పాయింట్లతో టాప్లో కొనసాగుతోం ది. అయితే సొంతగడ్డపై ఆంధ్రాతో జరిగిన తమ చివరి మ్యాచ్లో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ టాపర్గా ఉన్న సౌరాష్ట్ర ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది.
తాజావార్తలు
-
Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..