Ravindra Jadeja: గాయం నుంచి కోలుకున్న జడేజా.. కెప్టెన్గా రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. నేషనల్ టీమ్లోకి రావడానికి ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తొలుత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. అంతేకాదు వచ్చీ రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. మంగళవారం (జనవరి 24) నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీమ్కు జడేజా కెప్టెన్గా ఉండనున్నాడు. ప్రస్తుత కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో జడేజాకు సారథ్యం వహించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రం ‘వనక్కం చెన్నై’ అంటూ జడ్డూ ఓ ట్వీట్ చేయగా.. అది వైరల్ అయింది. ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడతాడన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై జడేజాకు సెకండ్ హోమ్గా మారిపోయింది. అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్ బ్యాక్ మ్యాచ్ ఆడుతుండటంతో పాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు. ఇక 2019-20 రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీమ్ మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్కు ఉనద్కత్తో పాటు వెటరన్ బ్యాటర్ పుజారాకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
- WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
గతేడాది ఆగస్ట్లో మోకాలి గాయం కారణంగా క్రికెట్కు దూరమైన జడేజా మళ్లీ ఇన్నాళ్లకు కాంపిటీటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. అంతేకాదు 2018 నవంబర్ తర్వాత జడేజా ఆడుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇదే. అతడు ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్కు ముందు ఈ మ్యాచ్ జడేజాకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఈ రంజీ ట్రోఫీ సీజన్లో తమ గ్రూప్లో సౌరాష్ట్ర 26 పాయింట్లతో టాప్లో కొనసాగుతోం ది. అయితే సొంతగడ్డపై ఆంధ్రాతో జరిగిన తమ చివరి మ్యాచ్లో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ టాపర్గా ఉన్న సౌరాష్ట్ర ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
Cheating: కేటుగాళ్లు కంత్రీ స్కెచ్.. ‘తల్లికి వందనం’ డబ్బులు బురిడీ
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!