Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
- ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డు
- రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన కోహ్లీ
- ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్పుర్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ సెంచరీ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు 21 అవార్డులు అందుకున్నాడు.
ఐపీఎల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ ఇప్పటివరకు 21 అవార్డులు గెలుచుకున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ 21 అవార్డులతో రోహిత్ సరసన చేరాడు. గత 18 ఏళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనలు చేస్తున్న కింగ్.. అనేక మ్యాచ్ల్లో ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్లో విరాట్ బ్యాటింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ‘మిస్టర్ కూల్’ ఇప్పటివరకు 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఫినిషర్గా, కెప్టెన్గా సీఎస్కే విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు.
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
నాలుగో స్థానంలో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెరో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో కొనసాగుతున్నారు. జడేజా బ్యాట్, బాల్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో మ్యాచుల్లో హీరోగా నిలిచాడు. మరోవైపు రాహుల్ తన క్లాసిక్ బ్యాటింగ్తో ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శనలు ఇస్తూ ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో చివరిగా యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యూసుఫ్.. 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ తొలి దశలో అత్యంత ప్రమాదకర భారత బ్యాటర్లలో యూసుఫ్ ఒకడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కేవలం వ్యక్తిగత ప్రతిభకే కాదు.. మ్యాచ్ పరిస్థితుల్లో జట్టును విజయపథంలో నడిపించే సామర్థ్యానికి గుర్తింపుగా భావిస్తారు. ఈ జాబితాలో ఉన్న భారత ఆటగాళ్లు తమ అద్భుత కెరీర్తో ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!