టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2024లోకి అడుగు పెట్టాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య భాయ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. అయితే, శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్య అదే రోజు ప్రాక్టీస్ను కూడా స్టార్ట్ చేశాడు. కాబట్టి, నెక్ట్స్ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటాడని చెప్పొచ్చు. వరుసగా మూడు పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ టీమ్ కు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే, గత మూడు మ్యాచ్ల్లో ముంబై టీమ్ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
Read Also: US-Iran: ఇజ్రాయిల్పై దాడికి కౌంట్డౌన్.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
అయితే, ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రాకతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ బలం పెరిగిపోయింది. ముఖ్యంగా మిడిలార్డర్లో ఇక, నుంచి భీకర బ్యాటింగ్ను చూడొచ్చు.. ముంబై తరపున 85 ఇన్నింగ్స్లు ఆడిన సూర్య కుమార్ 2688 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 20 హాప్ సెంచరీలు ఉన్నాయి. అంతే కాకుండా ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడుగా సూర్య కొనసాగుతున్నాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ తో రేపు ( ఆదివారం ) జరిగే మ్యాచ్లోనైనా ముంబై ఇండియన్స్ విజయాల ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి.