Bhuvneshwar Kumar: చివరి ఓవర్లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar on SRH Last Over vs RR: చివరి ఓవర్ వేస్తున్నప్పుడు మైదానంలో ఎలాంటి చర్చ జరగలేదని సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. చివరి ఓవర్లో తాను ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా బౌలింగ్ చేయాలనేదానిపై మాత్రమే దృష్టి సారించానని చెప్పాడు. ఈ మ్యాచ్లో ఎక్కువగా స్వింగ్ కావడం కూడా తమకు కలిసొచ్చిందని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. భువీ వికెట్ తీసి హైదరాబాద్కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని విజయాన్ని అందించిన భువనేశ్వర్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ… ‘చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. ఇది నా స్వభావం. ఆఖరి ఓవర్ వేసేటపుడు మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. నేను బౌలింగ్పైనే దృష్టి సారించాను. రెండు మంచి బంతులు పడితే.. ఫలితం మనకు అనుకూలంగా వచ్చేస్తుంది. ఈ మ్యాచ్లో ఎక్కువగా స్వింగ్ కావడం కూడా మాకు కలిసొచ్చింది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ.. 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Nitish Reddy: గెలుస్తామని అస్సలు అనుకోలేదు.. సూపర్ ఓవర్ ఆడుతామనుకున్నా: నితీశ్ రెడ్డి
‘ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఓ విధమైన ఆలోచనతో సిద్ధమయ్యా. కానీ మ్యాచ్లు జరిగే కొద్దీ.. బ్యాటర్లు దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. దీంతో నా బౌలింగ్లో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించా. ఈరోజు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసినా.. చివరలో పరుగులు ఇచ్చుకోక తప్పలేదు. సన్రైజర్స్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉన్నారు. అయినా భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!