Bhuvneshwar Kumar: చివరి ఓవర్లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar on SRH Last Over vs RR: చివరి ఓవర్ వేస్తున్నప్పుడు మైదానంలో ఎలాంటి చర్చ జరగలేదని సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. చివరి ఓవర్లో తాను ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా బౌలింగ్ చేయాలనేదానిపై మాత్రమే దృష్టి సారించానని చెప్పాడు. ఈ మ్యాచ్లో ఎక్కువగా స్వింగ్ కావడం కూడా తమకు కలిసొచ్చిందని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. భువీ వికెట్ తీసి హైదరాబాద్కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని విజయాన్ని అందించిన భువనేశ్వర్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ… ‘చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. ఇది నా స్వభావం. ఆఖరి ఓవర్ వేసేటపుడు మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. నేను బౌలింగ్పైనే దృష్టి సారించాను. రెండు మంచి బంతులు పడితే.. ఫలితం మనకు అనుకూలంగా వచ్చేస్తుంది. ఈ మ్యాచ్లో ఎక్కువగా స్వింగ్ కావడం కూడా మాకు కలిసొచ్చింది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ.. 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
Also Read: Nitish Reddy: గెలుస్తామని అస్సలు అనుకోలేదు.. సూపర్ ఓవర్ ఆడుతామనుకున్నా: నితీశ్ రెడ్డి
‘ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఓ విధమైన ఆలోచనతో సిద్ధమయ్యా. కానీ మ్యాచ్లు జరిగే కొద్దీ.. బ్యాటర్లు దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. దీంతో నా బౌలింగ్లో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించా. ఈరోజు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసినా.. చివరలో పరుగులు ఇచ్చుకోక తప్పలేదు. సన్రైజర్స్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉన్నారు. అయినా భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..