Rishabh Pant: నేను ఆడుంటే ప్లేఆఫ్స్కు వెళ్లేవాళ్లం.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant on Delhi Capitals Playoffs: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఆడుంటే.. ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరేదన్నాడు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెబుతున్నా అన్నాడు. ఐపీఎల్ 2024లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంత్పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆడలేదు. ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ 17వ సీజన్లో తన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. 14 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఘోరంగా ఓడితేనే ఢిల్లీకి ప్లేఆఫ్స్కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్నో మ్యాచ్ అనంతరం పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
Also Read: Sonakshi Sinha: పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా: సోనాక్షి సిన్హా
‘మా ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఒకవేళ బెంగళూరుతో మ్యాచ్లో నేను ఆడుంటే.. నాకౌట్కు చేరేవాళ్లమేమో. అంటే నా వల్లే ఢిల్లీ టీమ్ గెలుస్తుందని కాదు. ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని అంటున్నా. బెంగళూరు మ్యాచ్లో ఓడిపోవడం మా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. ఆ మ్యాచ్లో మా ప్లేయర్స్ అద్భుతంగానే పోరాడారు. కానీ పరాజయం తప్పలేదు. లక్నోను ఓడించి రేసులోకి వచ్చాం. ఇక ఆ దేవుడి చేతుల్లోనే అంతా ఉంది’ అని రిషబ్ పంత్ అన్నాడు. కోల్కతా, రాజస్థాన్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరగా.. మిగిలిన ఎండు స్థానాల కోసం ఐదు టీమ్స్ పోటీ పడుతున్నాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..