Riyan Parag: ఐపీఎల్లో రియాన్ పరాగ్ చరిత్ర.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో రియాన్ 13 ఇన్నింగ్స్ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ అద్భుత విజయాలు అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ (36; 26 బంతుల్లో, 2×4, 2×6) ఆడాడు.
ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2018 సీజన్లో పంత్ 579 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రియాన్ పరాగ్ (567), రోహిత్ శర్మ (538 రన్స్, 2013), గ్లెన్ మాక్స్వెల్ (513 రన్స్, 2021), దినేశ్ కార్తీక్ (498 రన్స్, 2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బెంగళూరు మ్యాచ్తో రోహిత్ రికార్డును రియాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండటంతో.. పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
అసోంకి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్.. 2020లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఎప్పుడో ఓసారి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. నెట్టింట ఎక్కువగా రచ్చ చేశాడు. దాంతో ఓవరాక్షన్ స్టార్ అని నెటిజెన్స్ ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ఐపీఎల్ 2023లో 7 ఇన్నింగ్స్ల్లో 70 పరుగులు మాత్రమే చేయడంతో తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. రూ.3.8 కోట్లు పెట్టుబడి పెట్టిన రాజస్థాన్ ప్రాంచైజీకి నిరాశే ఎదురైంది. అయితే దేవ్ధార్ ట్రోఫీ (354), సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో (510) అదరగొట్టిన పరాగ్.. అదే ఫామ్ను ఐపీఎల్ 2024లోనూ కొనసాగిస్తున్నాడు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!