RR vs SRH: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals Scored 214 In 20 Overs Against SRH: జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ‘రాయల్’ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66) విజృంభించడం.. యశస్వీ జైస్వాల్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆర్ఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. పాపం.. బట్లర్ 5 పరుగుల తేడాతో తన శతకం కోల్పోయాడు. చివర్లో సెంచరీ చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. భువనేశ్వర్ వేసిన యార్కర్ని పసిగట్టలేక, ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. సన్రైజర్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ఎస్ఆర్హెచ్కు అది సాధ్యం అవుతుందా?
Wrestlers Protest: కేంద్ర ప్రభుత్వానికి రైతుల అల్టిమేటం.. బ్రిజ్ భూషణ్ అరెస్టుకు మే 21 గడువు
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా.. జైస్వాల్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంతవరకూ బౌండరీల మోత మోగించేశాడు. ఓవైపు బట్లర్ సింగిల్స్ తీస్తూ మద్దతు ఇస్తుండగా.. జైస్వాల్ పరుగుల వర్షం కురిపించాడు. అయితే.. ఆ జోష్లోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ.. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇక కుదురుకున్నాక.. తన బ్యాట్కి పని చెప్పడం మొదలుపెట్టాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. బట్లర్ కూడా ఖాతా తెరిచాడు. ఇలా వీళ్లిద్దరూ పోటీపడి ఆడారు. ఎడాపెడా షాట్లతో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆచితూచి ఆడుతూనే.. అనుకూలమైన బంతులు వచ్చినప్పుడు విధ్వంసం సృష్టించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్కి ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Minister KTR : రేపు మంచిర్యాలలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
ఇక చివరివరకూ వీళ్లిద్దరే ఆడుతారని, బట్లర్ సునాయాసంగా సెంచరీ చేసుకుంటాడని అనుకుంటున్న తరుణంలో.. భువనేశ్వర్ షాకిచ్చాడు. బట్లర్ 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. యార్కర్ వేసి, ఎల్బీడబ్ల్యూగా అతడ్ని పెవిలియన్ పంపాడు. చివర్లో షిమ్రాన్ వచ్చినా.. ఎక్కువ భాగం సంజూనే బ్యాటింగ్ చేశాడు. చాలా ఊపుమీద ఉన్నాడు కాబట్టి, తనే స్ట్రైక్ తీసుకొని రప్ఫాడించాడు. దీంతో.. ఆర్ఆర్ స్కోరు 214/2కి చేరింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో చెరో వికెట్ తీసుకున్నారు. అయితే.. పరుగులు మాత్రం గట్టిగానే సమర్పించుకున్నారు. అత్యంత కీలక బౌలర్ మార్కండే అయితే.. తన 4 ఓవర్ల కోటాలో 51 పరుగులు ఇచ్చాడు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!