MI vs PBKS: పంజాబ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ముందు భారీ లక్ష్యం
Punjab Kings Scored 214 In 20 Overs Against Mumbai Indians: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఊచకోత కోసింది. ముంబై బౌలర్లపై దండయాత్ర చేసి, పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్స్టన్ (82 నాటౌట్), జితేశ్ శర్మ (49 నాటౌట్) విజృంభించడంతో.. పంజాబ్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీకి 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ముంబై అంత భారీ లక్ష్యాన్ని ఛేధించగలుగుతుందా?
Cyclone Mocha: వచ్చేవారం తూర్పుతీర రాష్ట్రాలకు ‘మోచా’ తుపాను ముప్పు..
Also Read
- Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
- LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ స్కోరు నత్తనడక సాగింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులే చేసింది. కానీ.. 11వ ఓవర్ నుంచి ఊచకోత మొదలుపెట్టింది. తర్వాతి 10 ఓవర్లలో పంజాబ్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, 136 పరుగులు చేసింది. జితేశ్ శర్మ, లివింగ్స్టన్ కలిసి ముంబై బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. వాళ్లిద్దరినీ గందరగోళానికి గురి చేసేందుకు ముంబై బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భారీ షాట్లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఇద్దరు.. ఎలాంటి బంతులు వచ్చినా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీ మోత మోగించేశారు. తొలుత జితేశ్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ప్రారంభించగా.. అతడ్ని చూసి లివింగ్స్టన్ కూడా రెచ్చిపోయాడు. ఈ ఇద్దరి ఆటతీరుని చూసి.. ముంబై బౌలర్లు ఒత్తిడికి గురై, ఆ ఒత్తిడిలో మరింత పేలవ బౌలింగ్ వేసి భారీ పరుగులు ఇచ్చేశారు. జితేశ్, లివింగ్స్టన్ కలిసి మూడో వికెట్కి ఏకంగా 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Ancient Cities: భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన 10 పురాతన నగరాలు
ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. జోఫ్రా ఆర్చర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే, పంజాబ్ బ్యాటర్ల చేతిలో బలి అయ్యాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షద్ ఖాన్ మొదట్లో బాగానే కంట్రోల్ చేశాడు కానీ, ఆ తర్వాత పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతగాడు.. ఒక వికెట్ తీసి, 48 పరుగులిచ్చాడు. పియూష్ చావ్లా మాత్రమే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులే ఇచ్చాడు. మరి.. 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించగలదా? అంత భారీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. ముంబై బ్యాటర్లు మొదటి నుంచే రప్ఫాడించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!