MI vs PBKS: పంజాబ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Scored 214 In 20 Overs Against Mumbai Indians: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఊచకోత కోసింది. ముంబై బౌలర్లపై దండయాత్ర చేసి, పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్స్టన్ (82 నాటౌట్), జితేశ్ శర్మ (49 నాటౌట్) విజృంభించడంతో.. పంజాబ్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీకి 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ముంబై అంత భారీ లక్ష్యాన్ని ఛేధించగలుగుతుందా?
Cyclone Mocha: వచ్చేవారం తూర్పుతీర రాష్ట్రాలకు ‘మోచా’ తుపాను ముప్పు..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..

తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ స్కోరు నత్తనడక సాగింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులే చేసింది. కానీ.. 11వ ఓవర్ నుంచి ఊచకోత మొదలుపెట్టింది. తర్వాతి 10 ఓవర్లలో పంజాబ్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, 136 పరుగులు చేసింది. జితేశ్ శర్మ, లివింగ్స్టన్ కలిసి ముంబై బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. వాళ్లిద్దరినీ గందరగోళానికి గురి చేసేందుకు ముంబై బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భారీ షాట్లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఇద్దరు.. ఎలాంటి బంతులు వచ్చినా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీ మోత మోగించేశారు. తొలుత జితేశ్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ప్రారంభించగా.. అతడ్ని చూసి లివింగ్స్టన్ కూడా రెచ్చిపోయాడు. ఈ ఇద్దరి ఆటతీరుని చూసి.. ముంబై బౌలర్లు ఒత్తిడికి గురై, ఆ ఒత్తిడిలో మరింత పేలవ బౌలింగ్ వేసి భారీ పరుగులు ఇచ్చేశారు. జితేశ్, లివింగ్స్టన్ కలిసి మూడో వికెట్కి ఏకంగా 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Ancient Cities: భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన 10 పురాతన నగరాలు
ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. జోఫ్రా ఆర్చర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే, పంజాబ్ బ్యాటర్ల చేతిలో బలి అయ్యాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షద్ ఖాన్ మొదట్లో బాగానే కంట్రోల్ చేశాడు కానీ, ఆ తర్వాత పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతగాడు.. ఒక వికెట్ తీసి, 48 పరుగులిచ్చాడు. పియూష్ చావ్లా మాత్రమే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులే ఇచ్చాడు. మరి.. 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించగలదా? అంత భారీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. ముంబై బ్యాటర్లు మొదటి నుంచే రప్ఫాడించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!