PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్‌ శర్మకు స్పెషల్ మ్యాచ్!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma set for big landmark in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గురువారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్, ముంబై జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ముంబై మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్పెషల్ కానుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్ రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌ 250వది కావడం విశేషం. దాంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. హిట్‌మ్యాన్ గత మ్యాచ్‌లో సెంచరీ చేసి చేయడం కూడా ఈ మ్యాచ్‌కు హైప్‌ క్రియేట్‌ అయింది. రోహిత్ ఆట కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. హిట్‌మ్యాన్ మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను పంజాబ్‌ తమ సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ.. హిట్‌మ్యాన్ అభిమానులే ఎక్కువగా ఉండే అవకాశ ఉంది. చూడాలి మరి స్పెషల్ మ్యాచ్‌లో రో’హిట్’ అవుతాడో లేదో.

Also Read: T20 World Cup 2024: ఎంఎస్ ధోనీని ఒప్పించడం కష్టమే: రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు రెండు జట్లకు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌ ఆరంభంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2013 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. దశాబ్ద కాలంగా ముంబైకి సారథ్యం వహించిన హిట్‌మ్యాన్.. ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు. 2024 సీజన్ ముందు అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్.. ప్రస్తుతం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడి 6472 రన్స్ చేశాడు. ఇందులో 2 శతకాలు, 42 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 109 నాటౌట్.