MS Dhoni: సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. పుకార్లకు చెక్ పెట్టిన ఎంఎస్ ధోనీ
- చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎంఎస్ ధోనీ గుడ్ న్యూస్..
- మరి కొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు తాను రెడీగా ఉన్నట్లు వెల్లడి..
- ఇకపై ఆడబోయే క్రికెట్ను మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నా: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగబోతుంది. ఆలోపు రిటెన్షన్, రైట్ టు మ్యాచ్తో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమ దగ్గర అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి గడువు అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉండగా.. ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ప్లేయర్ల జాబితాలను రిలీజ్ చేయలేదు. అయితే, ఒక్క ప్లేయర్ విషయంలోనే అభిమానుల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. అతడు ఈసారి ఐపీఎల్లో ఆడతాడా? లేదా? అనేది ప్రశ్న ఫ్యాన్స్ లో మెదులుతుంది. కానీ, తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఐపీఎల్లో పాల్గొనడంపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. మరి కొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు, మరో మూడేళ్ల వరకు అతడిని మైదానంలో చూసే ఛాన్స్ ఉంది. రిటైన్ చేసుకొనే ఆటగాళ్లను కనీసం మూడేళ్ల పాటు ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
ఇక, గోవాలో జరిగిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇకపై నేను ఆడబోయే క్రికెట్ను మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.. ప్రొఫెషనల్ గేమ్ ఆడేవాళ్లు ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు.. కానీ, నేను మాత్రం అలా ఉండకూడదని అనుకుంటున్నాను.. కానీ, ఇది చాలా కష్టమైనది.. కమిట్మెంట్స్, భావోద్వేగాలు చాలా ఉంటాయి.. వీటన్నింటినీ పక్కన పెట్టేసి రాబోయే కొన్నేళ్లు ఆటను మరింతగా ఆస్వాదిస్తాను అని చెప్పారు. అందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్నెస్పై దృష్టి పెట్టాను.. ఐపీఎల్లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడతా.. అందుకోసం పక్కాగా ప్రణాళిక చేసుకోవాలి.. అదే సమయంలో వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వెల్లడించాడు.
Read Also: Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో ఇరుక్కున్న దంపతులు.. ఊపిరాడక ఇబ్బంది
ఇక, CSK ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునే అవకాశం ఉంది. రూ.4 కోట్లకు అతడిని దక్కించుకునే అవకాశం ఉంది. గత సీజన్లో కెప్టెన్సీని వదిలిపెట్టిన ఎంఎస్ ధోనీ జట్టును నడిపించే బాధ్యతను యువ క్రికెటర్ రూతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. కాగా, గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు ప్లేఆఫ్కు చేరుకోలేకపోయింది. ఇక, గత సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఎంఎస్ ధోనీ 224.48 స్ట్రైక్ రేట్తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అతను 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!