RR vs RCB Controversy: ఈ సీజన్లోనే అతిపెద్ద వివాదం!! అడ్డంగా దొరికిన రాజస్థాన్ మేనేజర్.. పక్కనే వైభవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs RCB Controversy: ఐపీఎల్ 2026 సీజన్లో అతిపెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్ఆర్ VS ఆర్సీబీ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన పెద్ద కాంట్రర్సీకి దారి తీసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఫ్రాంచైజీ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో కూర్చుని తన ఫోన్ను ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బీసీసీఐ అవినీతి నిరోధక (Anti-Corruption) నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో ఫోన్ వాడటం పూర్తిగా నిషేధం. ఈ రూల్ను రోమీ భిందర్ అతిక్రమించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
అసలేం జరిగింది?
శుక్రవారం జరిగిన ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అందరూ మ్యాచ్ను వీక్షిస్తున్నారు. కెమెరా ఒక్కసారిగా డగౌట్ వైపు తిరిగింది. ఈ టైమ్లో రోమీ భిందర్ తన ఫోన్ వాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో ఆయన పక్కనే జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. రోమీ భిందర్ ఫోన్ స్క్రీన్ వైపు వైభవ్ చూస్తున్నట్లు వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది. ఈ అంశం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా (PMOA ప్రోటోకాల్ బ్రీచ్) పరిగణించబడుతోంది. దీనిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
PMOA ప్రోటోకాల్ ఏం చెబుతోంది?
ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం 2026 PMOA (ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) నిబంధనలు ప్రకారం.. డగౌట్ లేదా నిబంధనలు వర్తించే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం నిషిద్ధం. టీమ్ మేనేజర్ తన వద్ద ఫోన్ ఉంచుకోవచ్చు కానీ, దానిని కేవలం డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో మాత్రమే వాడాలి. డగౌట్లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం. ఇక ఈ అంశంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “డగౌట్లో మొబైల్ ఫోన్ వాడటం అనేది అస్సలు ఊహించలేని విషయం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ యాంటీ కరప్షన్ యూనిట్ ఏం చేస్తోంది?” అని ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు.. ఈ ఉల్లంఘనపై ఐపీఎల్ అధికారులు కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
— Cricket Iconic (@ankanghosh335) April 11, 2026
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..