ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వింటేజ్ ఫామ్ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్ కగిసో రబడ వేసిన ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు.
ఒకే ఓవర్లో 5 ఫోర్లు..
RCB తరపున ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన దిగ్గజాల సరసన కోహ్లీ ఇప్పుడు నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన వారిలో.. క్రిస్ గేల్ ఉన్నారు. ఇతడు 2013లో పుణే వారియర్స్ ఇండియాపై.. బౌలర్ ఈశ్వర్ పాండే బౌలింగ్ లో కొట్టాడు. షేన్ వాట్సన్.. 2016లో రైజింగ్ పూణే సూపర్జెయింట్స్ పై.. తిసార పెరీరా బౌలింగ్ లో కొట్టాడు. ప్రస్తుతం ఆ జాబితాలో విరాట్ కోహ్లీ నిలిచాడు.
తొలి 10 బంతుల్లోనే విధ్వంసం
ఈ మ్యాచ్లో కోహ్లీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన టీ20 కెరీర్లోనే ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి 10 బంతుల్లోనే అత్యధికంగా 28 పరుగులు రాబట్టాడు. గతంలో 2025లో బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై కూడా అతను సరిగ్గా 10 బంతుల్లో 28 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్లో 13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో మొత్తం 28 పరుగులు చేసి రబడ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్తో కోహ్లీ తన దూకుడును మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. పరుగుల యంత్రం మళ్ళీ పాత వేగాన్ని పుంజుకోవడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
