IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం స్పందిస్తూ డేవిడ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్పై భారీ జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అసభ్యకరమైన లేదా అవమానకరమైన సంజ్ఞలు, ఓవర్ యాక్షన్ చేసినందుకు గాను రెండు డెమెరిట్ పాయింట్లు సైతం విధించింది. టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేశారు. ప్రస్తుతం అతను సస్పెన్షన్కు చేరువలో ఉన్నాడు. మరో డెమెరిట్ పాయింట్ వస్తే ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.
డేవిడ్ మాత్రమే కాదు.. ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ సైతం క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొవడం గమనార్హం. ఫోర్త్ అంపైర్తో దూకుడుగా వ్యవహరిస్తూ, అసభ్య పదజాలం (Audible obscenity) వాడినందుకు గానూ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అల్లా గజన్ఫర్ బౌలింగ్ సమయంలో క్రునాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఫ్లవర్ అంపైర్తో వాగ్వాదానికి దిగారు. ఈ అంశాన్ని ఐపీఎల్ యాజమాన్యం సీరియస్గా తీసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయ్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ ఆఖరి బంతికి విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు, చివరి బంతికి రాసిఖ్ సలామ్ తీసిన డబుల్ రన్ తో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లడమే కాకుండా.. ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ను అధికారికంగా తప్పించింది.
