IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో లక్నో 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
సంజీవ్ గోయెంకా అండ..
సాధారణంగా జట్టు వరుసగా ఓడిపోతుంటే యజమానులు అసహనానికి గురవుతుంటారు. కానీ, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సంజీవ్ గోయెంకా తన జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వద్దకు వెళ్లి చాలా సేపు మాట్లాడారు. ఆయన పంత్ను ఆప్యాయంగా హత్తుకుని, ధైర్యం చెప్పారు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఓనర్ ఇలా కెప్టెన్కు అండగా నిలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న గోయెంకా, ఇప్పుడు తనలో వచ్చిన మార్పుతో అందరి మనసులు గెలుచుకున్నారు.
Also Read
- Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
- Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
- Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
- IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
Rishabh Pant hugging Sanjiv Goenka. ❤️ pic.twitter.com/2FLvsKfi51
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2026
మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు మొహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా రాణించి రాజస్థాన్ను 160 పరుగులకే పరిమితం చేశారు. అయితే, బ్యాటర్లు మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ అవ్వడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.
ఓటమి అనంతరం పంత్ చాలా నిరాశగా కనిపించాడు. తమ బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణమని అతను ఒప్పుకున్నాడు. “మా బౌలర్లు అద్భుతమైన పని చేశారు, కానీ బ్యాటింగ్ యూనిట్ గా మేము విఫలమయ్యాము. నేను కూడా బాధ్యతారాహిత్యంగా ఆడాను. మనం సమస్యలకు బయట ఎక్కడో కాకుండా, మన జట్టులోనే పరిష్కారాలు వెతుక్కోవాలి” అని పంత్ పేర్కొన్నాడు.
అయితే.. పంత్ ఇంకా ఆశలు వదులుకోలేదు. తమ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, తదుపరి మ్యాచ్ల్లో పుంజుకుని టోర్నీలో నిలబడతామని ధీమా వ్యక్తం చేశాడు. అటు ఓనర్ మద్దతు, ఇటు కెప్టెన్ పట్టుదల చూస్తుంటే లక్నో త్వరలోనే విజయాల బాట పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!