KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
- అద్భుత కంబ్యాక్తో ప్లేఆఫ్స్ రేసులోకి కేకేఆర్
- వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
- ఇకపై కేకేఆర్కు చావోరేవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత కంబ్యాక్తో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిస్తే.. కేకేఆర్ గరిష్టంగా 17 పాయింట్లకు చేరుకుంటుంది. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్కు సేఫ్ జోన్గా భావిస్తారు. దీంతో ఐపీఎల్ 2026లో కేకేఆర్కు ఇంకా అవకాశాలు పూర్తిగా ముగిసిపోలేదు.
ఈరోజు రాయ్పూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్ కేకేఆర్కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలు మరింత బలపడతాయి. ఓడిపోతే మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు తమ కంటే పైస్థానాల్లో ఉన్న జట్లు వరుసగా ఓడిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కనీసం రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అంతేకాకుండా నెట్ రన్రేట్ కూడా కేకేఆర్కు కీలకంగా మారనుంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో కేకేఆర్కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 10 పాయింట్లతో ఇంకా రేసులోనే ఉంది. దీంతో ఈసారి ప్లేఆఫ్స్ పోరు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
2022 నుంచి చూస్తే.. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. 2022లో ఆర్సీబీ, 2023లో ముంబై ఇండియన్స్, 2025లో కూడా ముంబై 16 పాయింట్లతో టాప్-4లో నిలిచాయి. అయితే 2024లో మాత్రం నాలుగు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలవగా.. మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరింది. ప్రస్తుతం కూడా నెట్ రన్రేట్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కేకేఆర్కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. వరుస విజయాలతో జోష్లో ఉన్న కోల్కతా జట్టు అదే జోరును కొనసాగిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!