KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
- అద్భుత కంబ్యాక్తో ప్లేఆఫ్స్ రేసులోకి కేకేఆర్
- వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
- ఇకపై కేకేఆర్కు చావోరేవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత కంబ్యాక్తో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిస్తే.. కేకేఆర్ గరిష్టంగా 17 పాయింట్లకు చేరుకుంటుంది. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్కు సేఫ్ జోన్గా భావిస్తారు. దీంతో ఐపీఎల్ 2026లో కేకేఆర్కు ఇంకా అవకాశాలు పూర్తిగా ముగిసిపోలేదు.
ఈరోజు రాయ్పూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్ కేకేఆర్కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలు మరింత బలపడతాయి. ఓడిపోతే మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు తమ కంటే పైస్థానాల్లో ఉన్న జట్లు వరుసగా ఓడిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కనీసం రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అంతేకాకుండా నెట్ రన్రేట్ కూడా కేకేఆర్కు కీలకంగా మారనుంది.
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో కేకేఆర్కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 10 పాయింట్లతో ఇంకా రేసులోనే ఉంది. దీంతో ఈసారి ప్లేఆఫ్స్ పోరు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
2022 నుంచి చూస్తే.. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. 2022లో ఆర్సీబీ, 2023లో ముంబై ఇండియన్స్, 2025లో కూడా ముంబై 16 పాయింట్లతో టాప్-4లో నిలిచాయి. అయితే 2024లో మాత్రం నాలుగు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలవగా.. మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరింది. ప్రస్తుతం కూడా నెట్ రన్రేట్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కేకేఆర్కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. వరుస విజయాలతో జోష్లో ఉన్న కోల్కతా జట్టు అదే జోరును కొనసాగిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!