వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్ మెగా లీగ్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించింది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, విలియమ్సన్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మను(31) షారుక్ఖాన్ పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ కెప్టెన్ విలియమ్సన్(3) పరుగులే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్త్రిపాఠి(34) మెరుగ్గా రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మార్క్రమ్(41), నికోలస్ పూరన్(35) నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ తీశాడు.
తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్(8) పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్(14) పరుగులకే ఓటయ్యాడు. లివింగ్ స్టోన్(60), షారుక్ ఖాన్(26) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్ కూడా రనౌట్ కాగా.. ఈ ఓవర్లో పంజాబ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.ఇప్పటిదాకా ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో వుంది.