IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
- ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా ఏప్రిల్ 25
- బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు
- అభిమానులకు అసలైన రన్ ఫెస్టివల్గా మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఏప్రిల్ 25.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయింది. రెండు మ్యాచ్లు, బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు స్థాయి ఛేజింగ్లు, వ్యక్తిగత ప్రదర్శనలు.. అన్నీ కలిసొచ్చి అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించాయి. ఢిల్లీ క్యాపిటల్స్vs పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డ ఈ రెండు మ్యాచ్లు అభిమానులకు అసలైన రన్ ఫెస్టివల్గా మారాయి.
మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా నితీష్ రాణా 91 పరుగులు బాదాడు. కానీ ఈ భారీ స్కోర్ కూడా ఢిల్లీకి విజయంను అందించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ అసాధారణంగా ఆడుతూ కేవలం 18.5 ఓవర్లలోనే 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభసిమ్రాన్ సింగ్ (76), శ్రేయాస్ అయ్యర్ (71), ప్రియాన్ష్ ఆర్య (43) జట్టుకు అద్భుత విజయం అందించారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 18.3 ఓవర్లలోనే 229 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) అద్భుతంగా ఆడారు. శనివారం నమోదైన రికార్డులు ఐపీఎల్ స్థాయిని మరోసారి చాటాయి. 265 పరుగుల లక్ష్యాన్ని తొలిసారిగా విజయవంతంగా ఛేదించడం, ఒకే రోజులో రెండు 220+ ఛేజింగ్లు జరగడం వంటి అరుదైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తక్కువ వయసులోనే సెంచరీలు బాదుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఐపీఎల్ ఎందుకు ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అనిపిస్తుందో మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!