ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చెన్నై ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
Read Also: Shahbaz Sharif: పాకిస్థాన్ ప్రధాని మొదటి పర్యటనలోనే సౌదీ అరేబియా షాక్..
కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా (34) పరుగులు చేశాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. నరైన్ (27) పరుగులు చేశాడు. ఆ తర్వాత రఘువంశీ (24), వెంకటేశ్ అయ్యర్ (3), రమన్ దీప్ సింగ్ (13), రింకూ సింగ్ (9), రస్సెల్ (10), అనుకుల్ రాయ్ (3) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా చెరో వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ రహమన్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.
Read Also: Sadhguru: బ్రెయిన్ సర్జరీ తర్వాత సద్గురు తాజా సందేశమిదే