BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
- మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం
- సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై వార్తలు
- గౌతమ్ గంభీర్ అభిప్రాయమే ఫైనల్
- టీ20 జట్టు భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Key Meeting on May 19: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయమే సూర్య టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా మారనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు.. ఇటీవల కాలంలో అతడి ఫామ్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్ల కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి మంగళవారం (మే 19) గౌహతిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టు భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికయ్యే టీ20 జట్టు గురించి చర్చించనున్నారని సమాచారం. టీ20 వరల్డ్ కప్ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన తర్వాత జరగనున్న తొలి కీలక సెలక్షన్ మీటింగ్ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు రిషభ్ పంత్ భవిష్యత్తుపై కూడా బీసీసీఐలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టెస్టు ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా కొనసాగుతున్న పంత్పై సెలెక్టర్లు సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గత రెండు సీజన్లలో పంత్ నాయకత్వం ఆశించిన స్థాయిలో లేకపోవడం, బ్యాటింగ్లో కూడా విఫలమవడం ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా సెలెక్టర్లు భావిస్తున్నారు. గత ఏడాది గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో శుభ్మన్ గిల్ గైర్హాజరీలో పంత్ కెప్టెన్సీ చేపట్టినప్పుడు వ్యూహాత్మకంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం సెలెక్టర్లలో ఉందని సమాచారం. ‘పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ను టీమిండియా కోల్పోవడానికి వీల్లేదు. అతడు స్వేచ్ఛగా ఆడితేనే జట్టుకు ఎక్కువ ఉపయోగపడతాడు. అదనపు బాధ్యతలు ఉన్నప్పుడు పంత్ బ్యాటింగ్పై ప్రభావం పడుతోంది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇక వన్డే జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానంపై కూడా తీవ్ర పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ప్రధాన వికెట్ కీపర్గా కొనసాగుతుండగా.. ధృవ్ జురెల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా పోటీలో ఉన్నారు. దీంతో రిషభ్ పంత్ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి గౌహతిలో జరగనున్న ఈ బీసీసీఐ సమావేశం భారత క్రికెట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ కొనసాగుతుందా?, పంత్ వైస్ కెప్టెన్గా కొనసాగుతుతాడా? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!