Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
- ఓటమిపై అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు
- వచ్చే ఏడాది చూసుకుంటాం అంటున్న అక్షర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 8 వికెట్ల తేడాతో ఓడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి డీసీ 20 ఓవర్లలో 142 పరుగులే చేసింది. పాతుమ్ నిశాంక (50; 29 బంతుల్లో 5×4, 3×6), అశుతోష్ శర్మ (39; 28 బంతుల్లో 3×4, 3×6) మినహా మిగతా ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్పై తాము చేసిన పరుగులు సరిపోవని అంగీకరించిన అక్షర్.. స్పిన్నర్లు కొన్ని కీలక తప్పిదాలు చేశారని తెలిపాడు. ఇంకా ఢిల్లీ ప్రయాణం ముగియలేదని, వచ్చే ఏడాది కూడా ఉందంటూ అక్షర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 4 విజయాలు అందుకుంది. మిగతా 4 మ్యాచ్లలో గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.
‘ఈ పిచ్పై మేము చేసిన పరుగులు సరిపోలేదు. అదే సమయంలో మా స్పిన్నర్లు కూడా కొన్ని తప్పులు చేశారు. పిచ్ ఎలా ప్రవర్తించిందో చూస్తే.. స్పిన్నర్ల నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయని అనిపించింది. కానీ మరోవైపు చూస్తే.. రెండు మూడు ఓవర్లలోనే మేము ఐదు వికెట్లు కోల్పోయాం. అక్కడే మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా మా చేతుల నుంచి జారిపోయింది. ఈ విషయంపై మేము ఆలోచించాలి. ఎందుకంటే చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలానే జరిగింది. మేము మంచి ఆరంభం చేసినా.. ఒక్కసారిగా వరుస వికెట్లు పడిపోతున్నాయి. వరుసగా వికెట్స్ కోల్పోవడమే మా ఓటమికి కారణం అవుతోంది’ అని అక్షర్ పటేల్ చెప్పాడు.
Also Read
- IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
‘ఓటములపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను, అశుతోష్ శర్మ బ్యాటింగ్ మాట్లాడుకున్నాం. మేము తప్పు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్కు చాలా కష్టంగా మారుతుందని చెప్పుకున్నాం. కాబట్టి సరైన మైండ్సెట్ను అమలు చేయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకటి లేదా రెండు వికెట్లు పడినా.. క్రీజులో కొంతసేపు నిలబడి ఆడొచ్చు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఒకటి రెండు ఓవర్లు ఒత్తిడిని తట్టుకుని ఆడటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము చేసిన తప్పుల గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. వచ్చే ఏడాది కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చిస్తాం. బెంచ్పై ఉన్న ఆటగాళ్లను కూడా పరీక్షించాలి. ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, జట్టులో ఎలాంటి మార్పులు చేయాలి అన్న విషయాలను నిర్ణయిస్తాం’ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..