Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
- ఓటమిపై అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు
- వచ్చే ఏడాది చూసుకుంటాం అంటున్న అక్షర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 8 వికెట్ల తేడాతో ఓడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి డీసీ 20 ఓవర్లలో 142 పరుగులే చేసింది. పాతుమ్ నిశాంక (50; 29 బంతుల్లో 5×4, 3×6), అశుతోష్ శర్మ (39; 28 బంతుల్లో 3×4, 3×6) మినహా మిగతా ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్పై తాము చేసిన పరుగులు సరిపోవని అంగీకరించిన అక్షర్.. స్పిన్నర్లు కొన్ని కీలక తప్పిదాలు చేశారని తెలిపాడు. ఇంకా ఢిల్లీ ప్రయాణం ముగియలేదని, వచ్చే ఏడాది కూడా ఉందంటూ అక్షర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 4 విజయాలు అందుకుంది. మిగతా 4 మ్యాచ్లలో గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.
‘ఈ పిచ్పై మేము చేసిన పరుగులు సరిపోలేదు. అదే సమయంలో మా స్పిన్నర్లు కూడా కొన్ని తప్పులు చేశారు. పిచ్ ఎలా ప్రవర్తించిందో చూస్తే.. స్పిన్నర్ల నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయని అనిపించింది. కానీ మరోవైపు చూస్తే.. రెండు మూడు ఓవర్లలోనే మేము ఐదు వికెట్లు కోల్పోయాం. అక్కడే మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా మా చేతుల నుంచి జారిపోయింది. ఈ విషయంపై మేము ఆలోచించాలి. ఎందుకంటే చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలానే జరిగింది. మేము మంచి ఆరంభం చేసినా.. ఒక్కసారిగా వరుస వికెట్లు పడిపోతున్నాయి. వరుసగా వికెట్స్ కోల్పోవడమే మా ఓటమికి కారణం అవుతోంది’ అని అక్షర్ పటేల్ చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
‘ఓటములపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను, అశుతోష్ శర్మ బ్యాటింగ్ మాట్లాడుకున్నాం. మేము తప్పు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్కు చాలా కష్టంగా మారుతుందని చెప్పుకున్నాం. కాబట్టి సరైన మైండ్సెట్ను అమలు చేయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకటి లేదా రెండు వికెట్లు పడినా.. క్రీజులో కొంతసేపు నిలబడి ఆడొచ్చు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఒకటి రెండు ఓవర్లు ఒత్తిడిని తట్టుకుని ఆడటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము చేసిన తప్పుల గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. వచ్చే ఏడాది కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చిస్తాం. బెంచ్పై ఉన్న ఆటగాళ్లను కూడా పరీక్షించాలి. ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, జట్టులో ఎలాంటి మార్పులు చేయాలి అన్న విషయాలను నిర్ణయిస్తాం’ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?