IPL: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో BCCI కి దెబ్బ మీద దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL మెగా టోర్నీకి సంబందించిన మీడియా హక్కుల వేలంలో BCCI కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇప్పటికే అమెజాన్, గూగుల్ సాంకేతిక బిడ్లు సమర్పించలేదు. ఇప్పుడు జీ సైతం ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. దాంతో డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
మరికొన్ని రోజుల్లో సోనీ నెట్వర్క్లో జీ విలీనం కాబోతోంది. అలాంటప్పుడు వారికి పోటీలో నిలవడంలో అర్థం లేదని జీ భావిస్తున్నట్టు తెలిసింది. దాంతో ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. అయితే ‘జీ ఎందుకు బిడ్ వేస్తుంది? వారి భాగస్వామి సోనీతో పోటీకి వస్తారా? అనేది ఇంకా తెలియాల్సివుంది. అయితే తర్వలోనే ఈ రెండు సంస్థలు విలీనం అవుతున్నాయి. అందుకే రేసులో ఉండటం లేదు’ అని జీ ప్రమోటర్ల సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
మీడియా హక్కుల వేలానికి వచ్చిన బిడ్లను BCCI న్యాయ, ఆర్థిక కమిటీలు శుక్రవారం మూల్యాంకనం చేశాయి. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలు ఆదివారం బిడ్డింగ్ రౌండ్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు డిస్నీ స్టార్, రిలయన్స్, సోనీ నెట్వర్క్, జీ ఎంటర్టైన్మెంట్ అర్హత సాధించాయని తెలిసింది. టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో డిజిటల్ హక్కుల్లో పాల్గొంటున్నాయి. సూపర్ స్పోర్ట్ ప్యాకేజ్ డీ బరిలో ఉంది. పోటీదారులు తక్కువమందే ఉన్నారు కాబట్టి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హక్కులు దక్కించుకుంటారని అనిపిస్తోంది.
చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ IPL ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్ బిడ్డింగ్ వేసింది. అయితే ఈ సారి BCCI కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్ సబ్కాంటినెట్ డిజిటల్ రైట్స్కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్ నాన్ ఎక్స్క్లూజివ్ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్, 4 ప్లేఆఫ్ మ్యాచులు, 13 ఈవినింగ్ డబుల్ హెడర్లు ఉంటాయి. సబ్కాంటినెట్కు ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!